
నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్కు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టుల కేంద్రం ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రూ.16,300 కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం ప్రకటించారు.
కీలక ఖనిజాల అంశంలో స్వావలంభన సాధించే దిశగా అడుగులు వేస్తూ కీలక ఖనిజాల దిగుమతిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కీలక ఖనిజాల ఉత్పత్తికి త్వరగా అనుమతులు ఇస్తామని కేంద్రం తెలిపింది. ఖనిజాలు వెలికి తీసే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు పేర్కొంది.
ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వావలభనం సాధించడం, ఖనిజాల దిగుమతులపై ఆధారపడటం తగ్గించడం కేంద్రం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను సమర్ధవంతంగా అధిగమించేందుకు ప్రభుత్వం గత రెండేళ్లుగా పలు చర్యలు తీసుకుంటోంది.
ఈ రంగంలో స్వావలంభన సాధించాలనే విజన్కు అనుగుణంగా 2024-25 బడ్జెట్లో క్రిటికల్ మినరల్ మిషన్ ఏర్పాటును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అరుదైన ఖనిజ వనరులు ఉన్న దేశాలతో వాణిజ్యాన్ని మెరుగుపరచుకోవడం, దేశీయంగా ఖనిజ నిల్వల అభివద్ధికి దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటీ కంపెనీలను నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ప్రోత్సిహిస్తుందని కేంద్ర మంత్రి చెప్పారు.
ఖనిజాల కోసం అన్వేషణ, కొత్త బ్లాక్లను కొనుగోలు చేయడం, క్లిష్టమైన ఖనిజ మైనింగ్ ప్రాజెక్టుల కోసం ఫాస్ట్ట్రాక్ ఆమోద ప్రక్రియను రూపొందించడం తదితర లక్ష్యాలను ఈ మిషన్ పర్యవేక్షించనున్నది. మిషన్ అన్వేషణకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తుంది. అధిక భారం, టైలింగ్ నుంచి ఈ ఖనిజాల పునరుద్ధరణ మిషన్ ప్రోత్సహిస్తుంది.
పీఎస్యూలు, ప్రైవేటు రంగ సంస్థలను విదేశాల్లో కీలకమైన ఖనిజ ఆస్తులను పొందేలా ప్రోత్సహించడం, వనరులు అధికంగా ఉన్న దేశాల్లో వాణిజ్యాన్ని పెంచడం ఈ మిషన్ లక్ష్యమని కేంద్రం పేర్కొంది. భారతదేశంలో కీలకమైన ఖనిజాల నిల్వను అభివృద్ధి చేయాలని కూడా మిషన్ యోచిస్తోంది.
ఈ సందర్భంగా కేంద్రం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (ఇబిపి) ప్రోగ్రామ్ కింద ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసిఎస్) ఇథనాల్ కొనుగోలు చేసే విధానానికి సైతం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇథనాల్ స్లపయ్ ఇయర్ (ఇ ఎస్ వై) 2024-25 కోసం ప్రభుత్వ రంగ ఓఎంసీఎస్ సరఫరా కోసం ఇథనాల్ ధరలను సవరించింది.
నవంబర్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే ఇథనాల్ సప్లయ్ ఇయర్ (ఇ ఎస్ వై) 2024-25 కోసం ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ లు) కోసం ఇథనాల్ సేకరణ ధరను సవరించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిఇఎ) ఆమోదం తెలిపింది.
ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (ఇబిపి) ప్రోగ్రామ్ కింద 2024 నుంచి 31 అక్టోబర్ 2025 వరకు.. 2024-25 ఇథనాల్ సప్లయ్ ఇయర్ (1 నవంబర్ 2024 నుంచి 31 అక్టోబర్ 2025 వరకు) వరకు సీ కేటగిరి హెవీ మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేయబడిన ఇథనాల్ ఎక్స్-మిల్ ధరను లీటరుకు రూ.56.28 నుండి రూ.57.97కి పెంచడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇథనాల్ సరఫరాదారులకు ధరల స్థిరత్వం తీసుకురావడం, లాభదాయకమైన మార్గడంతో పాటు ముడి చమురు దిగుమతలను ఆధారపడటాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నది. విదేశీ మారకంలో ఆదా చేయడంతో పాటు పర్యావరణానికి ప్రయోజనం అందించడంలో సహాయపడుతుంది. చెరకు రైతుల ప్రయోజనాల దృష్ట్యా గతంలో మాదిరిగానే జీఎస్టీ, రవాణా చార్జీలు వేర్వేరుగా చెల్లించాల్సి ఉంటుంది.
గత పదేళ్లలో (31.12.2024 నాటికి) పబ్లిక్ సెక్టార్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసిఎస్) పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల సుమారుగా రూ.1,13,007 కోట్ల విదేశీ మారక ద్రవ్యం.. ముడి చమురు ప్రత్యామ్నాయం దాదాపు 193 లక్షల మెట్రిక్ టన్నులు ఆదా అయ్యింది. 2013-14 ఇథనాల్ సప్లయ్ ఇయర్లో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసిఎస్) ఇథనాల్ కలపడం 38 కోట్ల లీటర్ల నుంచి 707 కోట్ల లీటర్లకు పెరిగింది.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు