
దీంతో జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని ఉన్నత న్యాయస్థానం చేయడంతో తన పిటిషన్ ను వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని రఘురామకృష్ణ రాజు తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. ఇందుకు ఉన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. జగన్ బెయిల్ రద్దుకు కారణాలు ఏమీ లేవని ఆ కేసుల్ని తమకు పర్యవేక్షించమంటారా? అంటూ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది.
అయితే తాము హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషన్ను వెనక్కి తీసుకుంటామని రఘురామ తరఫు లాయర్ కోరగా, ధర్మాసనం అంగీకరించింది. దీంతో రఘురామ వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ను ఉపసంహరించుకున్నారు.
కాగా, ఈరోజు రఘురామకృష్ణంరాజు పిటిషన్ పై జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం విచారణ జరిపారు. గతంలో సుప్రీంకోర్టు ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విషయంలో ఇచ్చిన తీర్పు ఈ కేసుకు కూడా వర్తిస్తుందని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. ట్రయల్ కోర్టు రోజు వారీ విచారణకు తీసుకోవాలని, హైకోర్టు కూడా పర్యవేక్షణ చేయాలని అందువల్ల మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది.
ఈ క్రమంలోనే జగన్ పై ఉన్న కేసులను బదిలీ చెయ్యాలని రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఉన్నత న్యాయం స్థానం కొట్టివేసింది. దీంతో సుప్రీం కోర్టులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొంతమేరకు ఊరట లభించింది. జగన్ ఆస్తుల కేసులో గత 12 ఏళ్లుగా విచారణ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని, ఒక్క డిశ్ఛార్జ్ అప్లికేషన్ కూడా డిస్పోజ్ చేయలేదని రఘురామ తరఫు లాయర్ వాదనలు వినిపించారు.
సుప్రీంకోర్టు గతంలోనే కేసుల బదిలీ సాధ్యం కాదని చెప్పిందని, కాబట్టి సుప్రీంకోర్టు ఈ కేసుల్ని పర్యవేక్షించాలని కోరుతున్నామన్నారు. సీబీఐ కేసుల వివరాలు, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసిందని దర్యాప్తు సంస్థ తరపు లాయర్ కోర్టుకు వివరించారు. ఈ కేసుల్ని హైకోర్టు మానిటర్ చేస్తోందని, ఇంకా కేసులు అక్కడ పెండింగ్లో ఉన్నాయని జగన్ తరఫు లాయర్ వాదించారు. ఈ వాదన్ని విన్న ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
More Stories
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి