
ఆ ఇన్స్పెక్టర్ ఓ కేసులో 3 లక్షలు లంచం తీసుకున్నట్లు ఆ ఆడియోలో ఉంది. ఇన్స్పెక్టర్ బాత్రూంలో డబ్బులు పెట్టినట్లు బాధితుడు చెబుతున్నాడు. సీసీటీవీ ఫుటేజీ చెక్ చేయాలని బాధితుడు ఉన్నతాధికారులను వేడుకుంటున్నట్లు ఆడియోలో ఉందని రాజాసింగ్ తెలిపారు.
ఇక తన నియోజకవర్గం గోషామహల్ పరిధిలోని షాహినాత్ గంజ్ పోలీసు స్టేషన్లో సీఐ ఏ బాబు చౌహాన ఒక కేసు నుంచి పేరు తీసేయాలంటే లక్షా యాభై వేలు అడిగిండు. డీల్ రూ. 50 వేలకు ఫైనల్ అయింది. బాధిత వ్యక్తి నుంచి రూ. 50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారని గుర్తు చేశారు.
ఈ ఏడాదిలో చాలా వరకు పోలీసులు లంచాలు తీసుకుంటూ అరెస్టు అవుతున్నారని రాజాసింగ్ తెలిపారు. లంచం మాఫియాపై సీవీ ఆనంద్ దృష్టి పెట్టాలని కోరారు. పోలీసు అధికారులు వారి ఛాంబర్లో కూడా సీసీ కెమెరాలు పెట్టాలని డీజీపీ, సీపీని ఆయన కోరారు. అక్రమంగా కేసు పెట్టిన తర్వాత, ఆ కేసులో పేరు తీసేసేందుకు డబ్బులు అడగడం దారుణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్రైమ్లో లేని నేను రూ. 50 వేలు ఎందుకివ్వాలని ఏసీబీకి ఫిర్యాదు చేసిండని పేర్కొంటూ మరి క్రైమ్ చేసిన వారి నుంచి ఎంత డబ్బులు వసూలు చేస్తున్నారు? అంటూ విస్మయం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు ఉండే ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టాలి. ఇలాంటి అధికారులు లంచాలు తీసుకున్నప్పుడు సస్పెన్షన్ చేయకుండా, జాబ్ నుంచి పూర్తిగా తొలగించాలని, ఇందుకు స్పెషల్గా ఒక జీవో తీసుకురావాలని ముఖ్యమంత్రికి రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.
More Stories
17 నుంచి `సేవా పక్షం అభియాన్’గా మోదీ జన్మదినం
దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు
తెలంగాణలో 15 నుంచి కాలేజీలు నిరవధిక బంద్