
టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నేత, నటి మాధవీలత మధ్య వివాదం మళ్లీ మొదలైంది. నూతన సంవత్సరం సందర్భంగా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన వేడుకలసందర్భంగా ఈ వివాదం మొదలైంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అర్ధరాత్రి ఏర్పాటుచేసిన పార్టీపై మాధవీలత అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అనుచిత వాఖ్యలు చేసిన ప్రభాకర రెడ్డి ఆ తర్వాత క్షమాపణలు చెప్పడంతో అంతటితో ఈ వివాదం ముగిసిపోయిందని అందరూ భావించారు.
అయితే, జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాధవీలత తాజాగా హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి సినీ పరిశ్రమకు చెందిన మహిళల గురించి తప్పుగా మాట్లాడారని, తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ఆమె ఫిర్యాదు చేశారు. దీనిపై మానవ హక్కుల కమిషన్, పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవడంతో పరిశ్రమ పెద్దలను ఆశ్రయిస్తున్నట్లు ఆమె తెలిపారు.
జేసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానే, సినిమాపరంగాన ఉన్నాయని, అయితే సినీ పరిశ్రమ దీనిపై స్పందించలేదని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కు ఫిర్యాదు చేసినట్లు మాధవీలత చెప్పారు. సినిమా వాళ్లపై ఆరోపణలు సరికాదన్న మాధవీలత, జేసీపై న్యాయపోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
సినిమా రంగంలో ఉన్న మహిళలపై అనుచితంగా మాట్లాడిన టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం ‘మా’ అసోసియేషన్ కోశాధికారి శివ బాలాజీకి ఆమె ఫిర్యాదును అందజేశారు. సినీరంగంలోని మహిళలపై జరుగుతున్న వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వారిపై ఆరోపణలు చేయడం తగదని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.
” సినిమా అమ్మాయినని చెప్పి, సినిమా వాళ్లు ఇలా తిరుగుతారు, అలా బతుకుతారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కచ్చితంగా సినీ పరిశ్రమకు సంబంధించింది. సినిమా పరంగానూ తిట్టారు, రాజకీయంగానూ తిట్టారు. సినిమా పరిశ్రమ గురించి మాట్లాడారు కావున దీనిని ఖండించాల్సిందే” అని ఆమె స్పష్టం చేశారు.
“2015 నుంచి నేను ఈ పరిశ్రమలో పనిచేస్తున్నా. సినిమా అనేది నా ప్యాషన్. బతుకుదెరువు కోసం నేను రాలేదు. నా నేచర్కు ఇది సెట్ అవ్వలేదేమో. అందుకే నా జాబ్ నేను చేసుకుంటున్నా. సోషల్ మీడియాలో ఎవరో ఏదో అంటే పట్టించుకోరేమో కానీ రాజకీయ నేతలు అంటే చాలా మంది నమ్ముతారు. అందుకే ఆయన (జేసీ ప్రభాకర్ రెడ్డి) వ్యాఖ్యలతో నేను చాలా హర్ట్ అయ్యా.”అని మాధవీలత తెలిపారు.
“రాంగ్ పర్సన్తో పెట్టుకున్నారు. నా గొంతు మూయించడం వారితో కాదు. నేను కూడా రాయలసీమ ప్రాంతంలోనే పెరిగా. రాగి సంగటి, నాటుకోడి తినే పెరిగా. ఫ్యాక్షన్ స్టోరీలు చూశా. రక్తం కారేది చూశా. అవన్నీ చూస్తూ పెరిగాను. నాకు భయమంటే తెలియదు. సినిమా రంగంలో పనిచేస్తున్న మహిళలను అవమానించేలా ఆయన మాట్లాడారు. ఆయనపై న్యాయ పోరాటం చేస్తా” అని మాధవీలత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
More Stories
15-16 శాతానికి అమెరికా సుంకాలు తగ్గే అవకాశం!
ఆర్ఎస్ఎస్, మహిళలు, జాతి నిర్మాణం
తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసంభవం