
అలాగే పసుపు ఉపయోగాలపై కూడా ప్రచారం చేయడం జరుగుతుందని, పంట దిగుబడి పెంచడం, సప్లై చైన్, మౌలిక వసతులు పెంపొందించడం, ఔషధ గుణాల నేపథ్యంలో ఫార్మా రంగంలో దీన్ని ఉపయోగించడం సహా అనేక అంశాల్లో రైతులకు బోర్డు నుంచి మద్దతు లభిస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను శాలువా, పసుపు కొమ్ముల దండతో ఎంపీ ధర్మపురి అరవింద్ సత్కరించారు. సంక్రాంతి రోజు పసుపు రైతుల కలను నెరవేర్చిన నరేంద్ర మోదీకి పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు కేవలం రైతులకు మాత్రమే కాదు, జిల్లా మొత్తానికి పర్యాటకంగా కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు వల్ల రైతులకు మెరుగైన ధర లభిస్తుందని చెబుతూ ఎగుమతులకు, స్టోరేజ్, మార్కెటింగ్, ప్రాసెసింగ్, రీసెర్చ్ సహా అనేక రకాలుగా ఉపయోగపడుతుందని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.
పసుపు బోర్డు విషయంలో రైతాంగాన్ని చాలా రకాలుగా గత ప్రభుత్వాలు మోసం చేశాయని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి విమర్శించారు. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అరవింద్ ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు సాధించారని గుర్తుచేశారు. పసుపు బోర్డు విషయంలో ఎన్నో రాష్ట్రాలు పోటీ పడ్డాయని చెప్పారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుకు ఎంపీ అరవింద్ కృషి మరువలేనిదని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ ఎమ్మెల్యేలు రాకేష్రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, పసుపు రైతులు పాల్గొన్నారు. తాను ఎంపిగా గెలిస్తే నిజామాబాద్ లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తానని 2019 ఎన్నికల్లో ఎంపి అరవింద్ ఇచ్చిన మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ