
భారత మీడియాకు విషాదకరంగా నూతన సంవత్సరం శుక్రవారం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ ప్రాంతంలో ఒక యువ రచయిత హత్యకు గురయ్యారు. 33 ఏళ్ల జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ స్థానిక కాంట్రాక్టర్ ఆస్తిలోని సెప్టిక్ ట్యాంక్లో మృతదేహంగా కనిపించాడు. ముఖేష్ తన యూట్యూబ్ ఛానల్ `బస్తర్ జంక్షన్’ ద్వారా అవినీతికి సంబంధించిన వార్తలను పరిశోధించి అందించడంతో ప్రఖ్యాతి వహించాడు. లక్షలాది మంది వీక్షకులు ఉన్నారు. పైగా, ఎన్ డి టి వి సహాయక రిపోర్టర్ కూడా.
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ఈ హత్యను తీవ్రంగా ఖండించారు ‘నిందితులను వదిలిపెట్టబోము’ అని స్పష్టం చేశారు. కాంక్రీట్తో సీలింగ్ చేసిన సెప్టిక్ ట్యాంక్లో మృతదేహాన్ని గుర్తించినట్లు బీజాపూర్ పోలీసులు వెల్లడించారు. అతని శరీరం వాచిపోయింది. తల, వెన్నుకు పలు చోట్ల గాయాలు అయ్యాయి. దుస్తుల ద్వారా అతన్ని గుర్తించారు. ముకేశ్ మొబైల్ లొకేషన్ ఆధారంగా.. అతను చివరి సారి సురేశ్ చంద్రాకర్ కాంట్రాక్టర్తో మాట్లాడినట్లు పసికట్టారు.
భారతదేశంలో ఓ జర్నలిస్ట్ హత్యను జెనీవా కేంద్రంగా “శక్తివంతమైన అవినీతిపరులపై స్ట్రింగ్ రిపోర్టింగ్ చేసినందుకు యువ మీడియా వ్యక్తి లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరం. యాదృచ్ఛికంగా, ముఖేష్ చంద్రకర్ ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా హత్యకు గురైన మొదటి జర్నలిస్ట్ అయ్యాడు. అతని హత్య వెనుక ఉన్న దోషులను గుర్తించడానికి, చట్టం ప్రకారం శిక్ష విధించడానికి మేము న్యాయమైన దర్యాప్తును డిమాండ్ చేస్తున్నాము” అని జెనీవాకు చెందిన అంతర్జాతీయ మీడియా భద్రత, హక్కుల సంస్థ ప్రెస్ ఎంబ్లెమ్ క్యాంపెయిన్ (పిఇసీ) తెలిపింది,
వీలైనంత త్వరగా ఆ జర్నలిస్ట్ కుటుంబానికి న్యాయం అందించడానికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు డియో సాయి వ్యక్తిగత ఆసక్తి చూపాలని పిఇసి అధ్యక్షుడు బ్లేజ్ లెంపెన్ కోరారు. ముకేష్ ఉపగ్రహ వార్తా ఛానెల్తో సహా అనేక మీడియా సంస్థలలో పనిచేశారని పిఇసీ దక్షిణాసియా ప్రతినిధి నవా ఠాకూరియా తెలియజేశారు.
“తన ప్రాంతంలోని వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులలో నిధుల దుర్వినియోగంపై నివేదిక ఇస్తూ పరిశోధనాత్మక జర్నలిజంలో ఆయన ఒక ముద్ర వేశారు. ధైర్యవంతుడైన జర్నలిస్ట్ బస్తర్ జిల్లాలో చురుకుగా ఉన్న అతి వామపక్ష తిరుగుబాటుదారుల నుండి కూడా ఆగ్రహాన్ని ఎదుర్కొన్నాడు. ముకేష్ సమాజంలోని అణగారిన వర్గాలకు బలమైన గొంతుగా స్థిరపడ్డాడు” అని ఆయన నివాళులు అర్పించారు.
2024లో ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలలో మీడియా ఉద్యోగుల మరణాల సంఖ్య 179కి చేరుకోగా, భారతదేశంలో జర్నలిస్టుల హత్యల సంఖ్యను నాలుగులోపు కొనసాగించిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. గత సంవత్సరం మీడియా బాధితులందరూ మధ్య భారత ప్రాంతం నుండి ఉన్నారని అంటూ, ఉత్తరప్రదేశ్లో ఇద్దరు జర్నలిస్టులు (అశుతోష్ శ్రీవాస్తవ, దిలీప్ సైని) హత్యకు గురయ్యారు,
తర్వాత బీహార్ (శివశంకర్ ఝా), మధ్యప్రదేశ్ (సల్మాన్ అలీ ఖాన్) లలో హత్యకు గురయ్యారు. ఇదిలా ఉండగా, ఈ కేసులో, పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సురేష్ చంద్రకర్ కోసం వెతుకుతున్నారు. బస్తర్ ఐజి పి సుందర్రాజ్ ముగ్గురు నిందితుల అరెస్టును ధృవీకరించారు. 2021లో మావోలు కిడ్నాప్ చేసిన సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్ను విడిపించడంలో ముకేశ్ కీలక పాత్ర పోషించాడు.
More Stories
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన