
ఈ ఏడాదిలో(2024) ప్రపంచ జనాభా 7.1 కోట్లు పెరిగి కొత్త సంవత్సరానికి 809 కోట్లకు చేరుకుంటుందని సోమవారం విడుదలైన అమెరికా జనాభా బ్యూరో నివేదిక అంచనా వేసింది. 2023తో పోలిస్తే 2024లో జనాభా పెరుగుదల స్వల్పంగా తగ్గి 0.9 శాతంగా నమోదైంది. 2025 జనవరిలో ప్రపంచ జనాభా 7.5 కోట్లు పెరుగుతుందని, ప్రతి సెకనుకు 4.2 జననాలు, 2.0 మరణాలు ప్రపంచవ్యాప్తంగా నమోదవుతాయని నివేదిక అంచనా వేసింది.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా జనాభా 800 కోట్ల మార్కును అధిగమించింది. అదే సమయంలో ఇప్పటివరకు ప్రపంచ దేశాల్లో చైనా అత్యధిక జనాభాను కలిగి ఉన్న దేశంగా ఉండగా, కొన్ని రోజుల క్రితమే చైనాను వెనక్కి నెట్టి భారత్ టాప్ ప్లేస్లోకి దూసుకెళ్లింది. 2025 జనవరి 1వ తేదీ నాటికి ప్రపంచ జనాభా 809 కోట్లకు చేరుకుంటుందని అమెరికా జనాభా బ్యూరో అంచనా వేసింది.
అందులో భారత్ అగ్రస్థానంలో ఉంటుందని తెలిపింది. ఇక 2024 డిసెంబర్ 31వ తేదీ నాటికి ప్రపంచ జనాభా 7.1 కోట్లు పెరిగినట్లు అమెరికా జనాభా బ్యూరో రిపోర్టు వెల్లడిస్తోంది. ఇది కొత్త సంవత్సరం నాటికి 809 కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. అయితే గతేడాది 2023 జనాభాతో పోలిస్తే 2024లో ప్రపంచ జనాభా పెరుగుదల స్వల్పంగా తగ్గినట్లు వెల్లడించింది. ప్రపంచ జనాభా పెరుగుదల కేవలం 0.9 శాతం మాత్రమే నమోదైనట్లు వివరించింది.
ఇక అమెరికా జనాభా గురించి కూడా ఈ నివేదిక వెల్లడించింది. 2024లో అమెరికా జనాభా 26 లక్షలు పెరిగినట్లు చెప్పింది. 2025 నాటికి అమెరికా జనాభా 34.1 కోట్లకు చేరుతుందని అంచనాలు వేసింది. కొత్త ఏడాది జనవరిలో అమెరికాలో ప్రతి 9 సెకన్లకు ఒక జననం, ప్రతి 9.4 సెకన్లకు ఒక మరణం ఉంటుందని అంచనాలున్నాయి.
2020 దశకంలో అమెరికా జనాభా దాదాపు 97 లక్షల మేరకు పెరిగినట్లు అమెరికా జనాభా బ్యూరో గణాంకాలు వెలువరిస్తున్నాయి. ఈ పెరుగుదల రేటు 2.9 శాతంగా ఉన్నట్లు తెలిపింది. 2010 దశకంలో అగ్రరాజ్యం జనాభా పెరుగుదల 7.4 శాతం ఉందని పేర్కొంది. ఇక 2024లో భారతదేశ జనాభా 144.17 కోట్లు అని వెల్లడించింది. 2025లో ప్రపంచంలోని అన్ని దేశాలను మించి భారతదేశ జనాభా అగ్రస్థానంలో ఉండే అవకాశాలు ఉన్నాయని ఈ బ్యూరో అంచనా వేసింది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్