
తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే సర్కారును గద్దె దించాలని కోరుతూ దీక్షబూనిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై తన మొక్కు చెల్లించుకున్నారు. ముఖ్యంగా షర్టు లేకుండా లుంగీ మాత్రమే ధరించిన ఆయన కొరడాతో తనను తాను ఆరు సార్లు కొట్టుకున్నారు. ఆపై రెండ్రోజుల పాటు ఉపవాస దీక్ష పాటించి రాష్ట్రంలో ఉన్న 6 మురుగన్ గుడులను దర్శించుకోబోతున్నారు.
ఇటీవలే చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో జరిగిన అత్యాచార ఘటనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఈయన రాష్ట్రంలోని చెడు అంతా మాయమైపోవాలని ఈ దీక్ష తీసుకున్నారు. అన్నా యూనివర్సిటీలో మూడ్రోజుల క్రితం జరిగిన అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై స్పందిస్తూ డీఎంకే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర సర్కారు వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా బాధితురాలి పేరు బయటకు రావడానికి కారణం ముఖ్యమంత్రి స్టాలిన్యే అంటూ అంటూ ఆరోపించిన అన్నామలై ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు తాను పాదరక్షలు ధరించబోనని ప్రతిజ్ఞ చేశారు. అది మాత్రమే కాకుండా వచ్చే ఎన్నికల్లో తాము ఒక్క రూపాయి కూడా ఓటర్లకు పంచకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామని, తాను గెలిచే వరకు చెప్పులు వేసుకోనంటూ అన్నామలై వివరించారు.
అలాగే అలాగే రాష్ట్రంలోని చెడు అంతమైపోవాలని కోరుకుంటా ఆ మురుగన్ను దర్శించుకుంటానని చెప్పుకొచ్చారు. గుడికి వెళ్లడం కంటే ముందుగా తన ఇంట్లో 6 కొరడా దెబ్బలు కూడా తింటానని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు, ఆయన మద్దతుదారులు కోయంబత్తూరులోని అన్నామలై ఇంటికి చేరుకున్నారు.
డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేత పట్టుకుని ఉదయం నుంచి గేటు బయట నిల్చున్నారు. అన్నామలై కూడా చెప్పిన చెప్పిన విధంగానే ఈరోజు తన మొక్కు చెల్లించుకున్నారు. ఉదయమే స్నానం చేసిన ఆయన లుంగీ మాత్రమే కట్టుకుని కొరడాతో తనను తాను కొట్టుకున్నారు. గట్టిగట్టిగా మొత్తం ఆరు దెబ్బలు కొట్టుకుని, ఆపై మురుగున్ స్వామిని దర్శించుకున్నారు.
శుక్రవారం రోజు ప్రారంభించిన ఉపవాస దీక్ష రేపటితో ముగియనుంది. అయితే ఈ రెండ్రోజుల పాటు అన్నామలై రాష్ట్రంలో ఉన్న మొత్తం 6 గుడులను దర్శించుకోబోతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు