
కొన్ని రోజుల క్రితం, విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారని ఎంపీ జియావుర్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులతో దీప్ సరాయ్ ప్రాంతంలోని ఎస్పీ ఎంపీ ఇంటికి వెళ్లారు. భారీ బందోబస్తు మధ్య గురువారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. పాత రెండు మీటర్లను తొలగించి కొత్త స్మార్ట్ మీటర్లను అమర్చారు. ఆ తర్వాత రెండు పాత మీటర్లను సీల్ చేసి పరీక్షల నిమిత్తం పంపించారు. గత ఆర్నెల్ల నుంచి ఆ మీటర్లు జీరో యూనిట్ చూపించాయి. ఆ రెండు మీటర్లను ల్యాబ్కు పంపగా, ఎంఆర్ఐ టెస్టులో ఆ మీటర్లు ట్యాంపరింగ్ జరిగినట్లు తెలిసింది.
ఆ నివేదిక ప్రకారం విద్యుత్ మీటరుతో సంబంధం లేకుండా ఎంపీ ఇంటికి విద్యుత్ సరఫరా జరిగిందని తేల్చారు. ఆ తర్వాత మళ్లీ ఎంపీ ఇంటికి వెళ్లారు. స్మార్ట్ మీటర్ల రీడింగ్ తీసి, ఇంట్లో అమర్చిన విద్యుత్ పరికరాలను తనిఖీ చేశారు. అనంతరం ఎంపీ ఇంటికి రెండు కిలోవాట్ల విద్యుత్ కనెక్షన్లు రెండు ఉన్నట్లు గుర్తించారు. కానీ ఆయన ఇంట్లో 16 కిలోవాట్లకు పైగా విద్యుత్తు వినియోగిస్తున్నారని తేల్చారు.
దీంతో ఎంపీ విద్యుత్ చౌర్యం చేసినట్లు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆయనకు రూ.1.91 కోట్లు జరిమానా విధించారు. అయితే తనిఖీల సమయంలో ఇంజనీర్లు అజయ్ శర్మ, వీకే గంగల్ను బెదిరించినందుకు ఎంపీ తండ్రి మమ్లుకూర్ రెహమాన్ బార్క్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం మారిందని, తమ ప్రభుత్వం వస్తే అంతుచూస్తామని మమ్లుకూర్ బెదిరించారని రికార్డు అయిన వీడియో ఆధారంగా కేసు పెట్టారు. కాగా, నవంబర్ 24వ తేదీన సంభల్లోని షాహి జామా మసీదు ఘటనలో ఎంపీ రెహ్మాన్పై కేసు బుక్ అయింది.
More Stories
ఈపీఎస్ కనీస పెన్షన్ రూ. 2,500కు పెంపు?
దేశంలో ఆరు నగరాల్లోనే సంపద సృష్టి
పెట్రోల్ వాహనాలతో సమానంగా విద్యుత్ వాహనాల ధరలు