
గురువారం పుతిన్ నాలుగున్నర గంటల పాటు సాగిన వార్షిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉక్రెయిన్తో యుద్ధంలో తాము విజయానికి చేరువలో ఉన్నామని తెలిపారు. తమ దళాలు రోజుకొక చదరపు కిలోమీటర్ భూభాగాన్ని ఆక్రమిస్తూనే ఉన్నామని పుతిన్ చెప్పారు. తాము చేపట్టిన ప్రత్యేక సైనిక ఆపరేషన్ విజయవంతమవుతోందని వెల్లడించారు.
2022లో ఉక్రెయిన్ కు తమ సైనికులను పంపడం రష్యా సైనిక, ఆర్ధిక వ్యవస్థలను బలోపేతం చేసినట్లు పుతిన్ తెలిపారు. ఇంకా ముందుగానే చేసిఉండాల్సిందని చెబుతూ మరింత ముందస్తు సన్నాహాలు చేసి ఉంటె బాగుండేదిదని చెప్పారు.
మరోవైపు, రష్యాకు మిత్రుడైన సిరియా అధ్యక్షుడు బషర్ అసద్ ను తొలగించడంతో తమ ప్రతిష్టకు భంగం ఏర్పడిందనే వాదనను ఆయన తోసిపుచ్చారు. రష్యా ఆశ్రయం ఇచ్చిన అసద్ ను తాను ఇంకా కలుసుకోలేదని, త్వరలో కలుసుకుంటానని చెప్పారు. సిరియాలో మొత్తం మీద తాము తమ లక్ష్యాలను సాధించామని పుతిన్ స్పష్టం చేశారు.
ఒకప్పుడు అస్సాద్ పాలనతో, ప్రభుత్వ దళాలతో పోరాడిన సమూహాలు కూడా అంతర్గత మార్పులకు గురయ్యాయని గుర్తు చేశారు. “నేడు అనేక ఐరోపా దేశాలు, అమెరికా వారితో సంబంధాలు ఏర్పరచుకోవాలని కోరుకోవడం వృధా కాదు. అవి ఉగ్రవాద సంస్థలు అయితే, మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? అంటే వారు మారిపోయారు, కాదా?” అని ఆయన ప్రశ్నించారు.
More Stories
ఆసియాన్ సదస్సులో వర్చువల్ గా మోదీ
రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు
మహిళల కోసం జైషే ఆన్ లైన్ ‘జీహాదీ కోర్స్’