
సనాతన ధర్మంలో అత్యంత ప్రాచీనమైన క్రియో యోగ ధ్యాన సాధన ద్వారా ఆధ్మాత్మికంగా అత్యుత్తమ ఫలితాలు పొంద వచ్చని యోగదా సత్సంగ సొసైటీ ఉపాధ్యక్షులు స్వామి స్మరణానంద తెలిపారు. ఆత్మసాక్షాత్కర మార్గం క్రియాయోగ ధ్యానం ద్వారా సులభతరమవుతుందని చెప్పారు.
క్రియోయోగ ధ్యానానికి సంబంధించిన ప్రాధమిక విషయాలపై సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ సమీపంలోని ఆర్యవైశ్య అభ్యుదయ సంఘంలో శనివారం సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ప్రత్యేక ధ్యాన తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఈ ధ్యాన తరగతులను నిర్వహిస్తున్నట్లు స్వామి స్మరణానంద వెల్లడించారు.
భగవదన్వేషకులు, భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ధ్యాన తరగతులను హాజరై ప్రయోజనం పొందాలని ఆయన పిలుపు నిచ్చారు. మరిన్ని వివరాలకు 9666665328, 9866548484 నంబర్లకు ఫోన్ చేయవచ్చని వైఎస్ఎస్ హైదరాబాద్ మేనేజింగ్ కమిటీ మెంబర్ శశివదనా రెడ్డి తెలిపారు. ఈ క్రియాయోగ ధ్యాన తరగతులకు వారు యోగదా సత్సంగ సొసైటీ క్రియోయోగ పాఠాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని ఆమె చెప్పారు.
More Stories
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు
తెలంగాణాలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల