
ఇరువురి తలకు గాయాలు కావడంతో వారిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేర్చినట్లు మెడికల్ సూపరింటెండెంట్ అజయ్ శుక్లా తెలిపారు. గారికి ఐసియులో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఎంపీ సారంగికి తలపై కుట్లు వేశామని చెప్పారు. సృహకోల్పోయిన ఎంపీ ముకేశ్ రాజ్పుత్ స్పృహలోకి వచ్చారని వివరించారు. ఆయనకి బీపీ ఎక్కువగా ఉందని, అందుకే పరీక్షలు చేశామని, రిపోర్ట్స్ ఆధారంగా చికిత్స కొనసాగుతోందని డాక్టర్ శుక్లా వెల్లడించారు.
ఇలా ఉండగా, బీజేపీ, ప్రతిపక్ష నేతల కారణంగా పార్లమెంట్ ప్రాంగణంలో నెలకొన్న గందరగోళ సమయంలో రాహుల్ తనను అసౌకర్యానికి గురిచేసినట్లు నాగాలాండ్ కు చెందిన బీజేపీ మహిళా ఎంపీ ఫంగ్నోన్ కొన్యాక్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కాగా, బీజేపీ ఎంపీలు తనను తోసేసినట్లు మల్లికార్జున ఖర్గే లోక్సభ స్పీకర్కు తెలిపారు. బీజేపీ ఎంపీలు నెట్టడం వల్లే బ్యాలెన్స్ తప్పి మకర ద్వారం వద్ద కింద పడిపోయినట్లు పేర్కొన్నారు. మరోవైపు లోక్సభలో రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు దురుసుగా ప్రవర్తించారని, ఆయనను పార్లమెంట్లోకి రాకుండా అడ్డుకున్నారని కాంగ్రెస్ ఎంపీలు లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు.
నాలుగు రోజుల క్రితమే ఎంపీల ప్రవేశాన్ని ఎవరూ అడ్డుకోవద్దని స్పీకర్ చెప్పారని, అయినా బీజేపీ వాళ్లు రాహుల్ను అడ్డుకున్నారని కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. కాంగ్రెస్ ఎంపీలు కూడా బీజేపీపై ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు అందజేశారు. దీంట్లో ఆ పార్టీ మహిళా ఎంపీలు కూడా ఉన్నారు.
మరోవంక, అంబేద్కర్ వివాదం నుండి హోంమంత్రి అమిత్ షాను కాపాడటం కోసం తన సోదరుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కుట్రపూరితంగా ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. రాహుల్ గాంధీకి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా మద్దతు తెలిపారు. ఆయనది అటువంటి వ్యక్తిత్వం కాదని స్పష్టం చేశారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం