
లోపరహిత ఓటరు జాబితా వంటి కనీస సంస్కరణలతో ఎన్నికలను నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు అంగీకరిస్తే 2025 నవంబర్ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే, ఎన్నికల సంస్కరణల పూర్తి జాబితాను క్లియర్ చేయాలంటే మరికొన్ని నెలలు ఆలస్యం కావచ్చని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై యూనస్పై ఒత్తిడి పెరుగుతుండటంతో ఈ వ్యాఖ్యలు చేశారు.
బంగ్లాదేశ్లో ఈ ఏడాది జనవరిలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఈ ఎన్నికల్లో పాల్గొనలేదు. దీంతో బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ కుమార్తె షేక్ హసీనా సునాయాసంగా నాలుగోసారి ప్రధాని పీఠాన్ని చేజిక్కించుకున్నారు.
ప్రధాని షేక్ హసీనా ఎన్నికలను జరిపిన తీరుపై అంతర్జాతీయంగా విమర్శలు కూడా వచ్చాయి. ఆ తర్వాత, హసీనా ప్రభుత్వం ఎన్నో రోజులు అధికారంలో నిలవలేదు. రిజర్వేషన్లపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు.
ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఆమె రాజీనామాతో బంగ్లాలో మహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో తదుపరి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు ఉంటాయా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలోనే యూనస్ కీలక ప్రకటన చేశారు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా