
ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లారఖా పెద్ద కుమారుడైన జాకీర్ హుస్సేన్ చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో నడిచారు. ఈ క్రమంలో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్లో నైపుణ్యం సాధించి తనదైన ముద్ర వేశారు. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ప్రపంచంలోని గొప్ప తబలా వాద్యకారుల్లో ఒకరు. ఏడేళ్ల వయసులోనే తొలి ప్రదర్శన ఇచ్చారు. 12 ఏళ్ల వయస్సులోనే తొలి కచేరీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
1990లో భారత ప్రభుత్వ నుంచి సంగీత నాటక అకాడమీ అవార్డు, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, 2018లో రత్న సదస్యను అందుకున్నారు. హుస్సేన్ మిక్కీ హార్ట్, గియోవన్నీ హిడాల్గోతో కలిసి గ్లోబల్ డ్రమ్ ప్రాజెక్ట్ కోసం ప్రపంచ సంగీత ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. గెలుచుకున్నారు. హుస్సేన్ నాలుగు విజయాలతో ఏడు గ్రామీ అవార్డు ప్రతిపాదనల వరకు వెళ్లగా.. ఫిబ్రవరి 2024లో మూడు గ్రామీలను కూడా స్వీకరించారు.
భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ (1988), పద్మభూషణ్ (2002), పద్మవిభూషణ్ (2023)లతో సత్కరించింది. 1999లో యూఎస్ నేషనల్ ఎండోమెంట్ ఫర్ ది ఆర్ట్స్ ద్వారా నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్తో సత్కరించారు. ఆ తర్వాత ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రపంచ రాయబారిగా గుర్తింపు పొందారు.
తబలా వాద్యకారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయనను వైట్హౌస్కు ఆహ్వానం అందుకున్నారు. తొలిసారిగా వైట్హౌస్లోకి వెళ్లేందుకు ఆహ్వానం అందుకున్న తొలి భారతీయ సంగీతకారుడు. ఆయన 1980వ దశకంలో పలు చిత్రాలకు సైతం పని చేశారు.
1999లో అమెరికా ఆయనకు నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్ ప్రదానం చేసినప్పుడు భారత శాస్త్రీయ సంగీతానికి ప్రపంచ రాయబారిగా గుర్తింపు పొందారు. అతను 1973లో ఇంగ్లిష్ గిటారిస్ట్ జాస్ మెక్లాగ్లిన్, వయోలిన్ వాద్యకారుడు ఎల్ శంకర్, పెర్కెషన్ వాద్యకారుడు టీహెచ్ విక్కు వినాయక్రామ్తో కలిసి చేసిన సంగీత ప్రాజెక్టు సంగీత ప్రియులను కొత్త లోకంలోకి తీసుకువెళ్లింది. జాకీర్ హుస్సేన్ నటుడు కూడా. ఆయన శశికపూర్తో ఒక హాలీవుడ్తో పాటు పలు బాలీవుడ్ చిత్రాలలో నటించారు.
జాకీర్ హుస్సేన్ భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తంగా ఐదు గ్రామీ అవార్డులు గెలుచుకున్న ఆయన, ఈ ఏడాది ప్రారంభంలో 66వ గ్రామీ అవార్డుల్లో మూడింటిని కైవసం చేసుకున్నారు. ఆరు దశాబ్దాల పాటు సాగిన సంగీత ప్రయాణంలో మన దేశంతోపాటు ఎంతో మంది అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు