
‘భారత్-శ్రీలంకల మధ్య ఆర్థిక భాగస్వామ్యానికి పెట్టుబడి ఆధారిత వృద్ధి అవసరమని ఇరుపక్షాలు నిర్ణయించుకున్నాయి. ఫిజికల్, డిజిటల్, ఎనర్జీ కనెక్టివిటీ అనేవి ఇరుదేశాల ఆర్థిక సంబంధాలకు మూల స్తంభాలుగా ఉండాలి’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కనెక్టివిటీ, మల్టీ ప్రొడక్ట్ పెట్రోలియం పైప్లైన్ ఏర్పాటుకు కృషి చేస్తామని, దీని ద్వారా శ్రీలంకకు ద్రవీకృత సహజ వాయువు (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్)ను సరఫరా చేస్తామని మోదీ చెప్పారు. భారత్-శ్రీలంకల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు రామేశ్వరం – తలైమానార్ మధ్య ఫెర్రీ సర్వీస్లను ప్రారంభించున్నట్లు మోదీ ప్రకటించారు.
‘ఇరుదేశాల భద్రతా ప్రయోజనాలు పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయి. అందుకే రక్షణ సహకార ఒప్పందాన్ని త్వరలో ఖరారు చేసుకోవాలని మేము నిర్ణయించాం. ఇప్పటికే హైడ్రోగ్రఫీ సహకారం కోసం ఒప్పందం కుదిరింది’ అని మోదీ చెప్పారు. ప్రధాని మోదీ, శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే మధ్య మత్స్యకారుల సమస్యలు కూడా చర్చకు వచ్చాయి. మత్స్యకారుల జీవనోపాధికి సంబంధించిన అంశంలో మానవతా దృక్పథంతో ముందుకు సాగాలని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చాయి.
“శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత, ఇదే నా మొదటి విదేశీ పర్యటన. భారత్లో పర్యటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. పబ్లిక్ సర్వీస్లను డిజటలైజ్ చేయడంలో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. శ్రీలంక కూడా ఇదే బాటలో నడుస్తోంది. ఈ ప్రయత్నంలో శ్రీలంకకు భారత్ మద్దతుగా ఉంటుందని మోదీ హామీ ఇచ్చారు” అని అనుర కుమార దిసనాయకే తెలిపారు.
విదేశాంగ మంత్రి జైశంకర్ సైతం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ లో భారత్లో తొలిసారిగా పర్యటిస్తున్న దిసనాయకేను కలవడం ఆనందంగా ఉందని తెలిపారు. నైబర్హుడ్ ఫస్ట్ విధానం, సాగర్ ఔట్లుక్కి శ్రీలంక కీలకమైందని, ప్రధాని మోదీ, దిసనాయక మధ్య చర్చలు విశ్వాసం, సహకారాన్ని పొందిస్తాయని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ జరిపిన చర్చల్లో పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై చర్చించినట్లు దిసనాయకే తెలిపారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకోగా కేంద్ర మంత్రి ఎల్ మురుగన్తో పాటు అధికారులు స్వాగతం పలికారని సోషల్ మీడియా పోస్ట్లో తెలిపారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం