
అయితే జమిలి ఎన్నికల కోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లులో లోక్ సభతో పాటు అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితులకు సంబంధించిన నిబంధన ఒకటి ఉంది. సెక్షన్ 2 సబ్ క్లాజ్ 5 ప్రకారం లోక్సభతో పాటు ఏదైనా శాసనసభకు ఎన్నికలు నిర్వహించలేమని ఈసీ అభిప్రాయపడితే తర్వాత అసెంబ్లీలకు ఎన్నికలు జరపవచ్చు.
శాసనసభ ఎన్నికలకు ఉత్తర్వులు ఇవ్వాలని ఈసీ రాష్ట్రపతికి సిఫార్సు చేయాలి. ఈ క్రమంలో రాష్ట్రపతి అసెంబ్లీ ఎన్నికల కోసం ఉత్తర్వులు జారీ చేయాలి. అలాగే లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికల అమలు కోసం రాజ్యాంగంలో కొత్తగా 82ఎ అధికరణాన్ని చేర్చాల్సి ఉంటుంది.
పార్లమెంటు పదవీ కాలంలో మార్పు కోసం అధికరణం 83, అసెంబ్లీల పదవీ కాలం సవరణకు అధికరణం 172, ఎన్నికల నిబంధనల రూపకల్పన కోసం పార్లమెంటుకు అధికారం కల్పించే అధికరణం 327 సవరించాల్సి ఉంటుంది. అలాగే సార్వత్రిక ఎన్నికలు తర్వాత లోక్సభ మొదటి సమావేశం జరిగే తేదీపై రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేయాలి. ఆ నోటిఫికేషన్ తేదీని అపాయింటెడ్ డేట్ అంటారు. ఆ నిర్ణీత తేదీ నుంచి లోక్సభ పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది.
జమిలి ఎన్నికల నిర్వహణపై అనేక అనుమానాలు నెలకొన్నవేళ దీనిపై విస్తృత సంప్రదింపుల కోసం బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని స్పీకర్ ఓం బిర్లాను కేంద్రమంత్రి అభ్యర్థించనున్నారు. అనంతరం దీనిపై ప్యానెల్ కమిటీ ఏర్పాటుకు సభ్యులను ప్రతిపాదించాలని సభాపతి పార్టీలను కోరనున్నారు. సాయంత్రానికి కమిటీ సభ్యులను ప్రకటించే అవకాశం ఉంది.
పార్లమెంట్లో పార్టీల సంఖ్యాబలం ఆధారంగా కమిటీలో వారికి చోటు దక్కుతుంది. అంటే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ నుంచి ఒక ఎంపీ కమిటీ ఛైర్మన్ గా ఉంటారు. తొలుత ఈ ప్రతిపాదిత కమిటీకి 90 రోజుల సమయం కేటాయిస్తారు. అవసరాన్ని బట్టి ఆ తర్వాత దాన్ని పొడిగించొచ్చు.
More Stories
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు