పార్లమెంటు ముందుకు వక్ఫ్‌ బిల్లు

పార్లమెంటు ముందుకు వక్ఫ్‌ బిల్లు
ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు అదానీ అవినీతి అంశంపై వేడెక్కనున్నాయి. ఈ సమావేశాల్లో పెండింగ్‌లో ఉన్న వక్ఫ్‌ సవరణ బిల్లు సహా మొత్తం 16 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఆగస్టులో సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్‌ సవరణ బిల్లును ఉభయ సభల జాయింట్‌ కమిటీ అధ్యయనం కోసం పంపారు. 
 
శీతాకాల సమావేశం ప్రారంభమైన తొలివారం ఆఖరిరోజు ఈ నివేదిక సమర్పించాలని గతంలోనే నిర్ణయించారు. దీంతో వారు నివేదిక ఇచ్చిన అనంతరం బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి.

ఈ నెల 25 నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చకు రానుంది. లోక్‌సభ సచివాలయం బుధవారం విడుదల చేసిన బులిటెన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆగస్టు 8న సభ ముందు ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు-2024ను ఆ మరుసటి రోజు జాయింట్ కమిటీ అధ్యయనం కోసం పంపారు. 

శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి వారం చివరి రోజు కమిటీ నివేదికను పార్లమెంటుకు సమర్పించాలని ఇదివరకే నిర్దేశించారు. అందువల్ల జాయింట్ కమిటీ తన నివేదికను 29 లోపు సభ ముందు ప్రవేశపెట్టే అవకాశముంది. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన బిల్లుపై సభలో చర్చించి మోదించనున్నారు.

మరోవైపు, నివేదికకు తుది మెరుగులు దిద్దనుంది జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ). అందులో భాగంగా బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని కమిటీ గురువారం భేటీ కానుంది. వక్ఫ్ బిల్లుపై నివేదికను ఫైనల్ చేయనుంది. ఒకే దేశం-ఒకే ఎన్నిక నినాదంతో జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ఇదివరకే ఆమోదం తెలిపింది. అయితే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే కొత్త బిల్లుల జాబితాలో ఇది లేకపోయినప్పటికీ ఈ సమావేశంలోనే దీనిని కూడా ప్రవేశపెడతారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

దీంతో పాటు డిజాస్టర్ మేనేజ్‌మెంట్-అమెండ్‌మెంట్ బిల్లు, రైల్వేస్ బిల్లు, బ్యాంకింగ్ లాస్ వంటి బిల్లులను గత ఆగస్టులోనే సభలో ప్రవేశపెట్టినట్టు సచివాలయం పేర్కొంది. ఐదు కొత్త బిల్లులలో కోస్టల్‌ షిప్పింగ్‌ బిల్లు, ద ఇండియన్‌ పోర్ట్స్‌ బిల్లు, మర్చంట్‌ షిప్పింగ్‌ బిల్లు, కో-ఆపరేటివ్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్రీయ సహకార విశ్వవిద్యాలయ బిల్లు, పంజాబ్‌ కోర్ట్స్‌ (సవరణ) బిల్లు ఉన్నాయి.