ఉక్రెయిన్పై ఉదయం చేసిన దాడిలో రష్యా తన దక్షిణ ఆస్ట్రాఖాన్ ప్రాంతం నుండి ఖండాంతర క్షిపణిని ప్రయోగించిందని కీవ్ వైమానిక దళం తెలిపింది. యుద్ధం మొదలైన తర్వాత రష్యా ఇంత సుదూర, శక్తివంతమైన క్షిపణిని ఉపయోగించడం ఇదే తొలిసారి అని ఉక్రెయిన్ పేర్కొంది. అనేక రకాల మిస్సైళ్లతో డిప్రోను టార్గెట్ చేసినట్లు అంచనా వేస్తున్నారు.
ఖండాంతర క్షిపణలు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. అత్యధికంగా ఆ మిస్సైళ్లు 5వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. అయితే తాజా అటాక్ సమయంలో ఆరు కేహెచ్-101 క్రూయిజ్ మిస్సైళ్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ మిలిటరీ పేర్కొన్నది. డిప్రో సిటీపై జరిగిన దాడిలో భారీ నష్టం సంభవించింది. పలు భవనాలు కూలిపోయాయి. అనేక మంది గాయపడ్డారు. బ్రిటన్కు చెందిన రెండు స్టార్మ్ షాడో మిస్సైళ్లను కూల్చివేసినట్లు ఇవాళ రష్యా మిలిటరీ ప్రకటించింది.
జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉక్రెయిన్కు యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్ల ఏర్పాటును ఆమోదించిన తర్వాత, వ్లోదిమీర్ జెలెన్స్కీ ఒక వీడియోలో యుఎస్కి కృతజ్ఞతలు తెలిపారు, ల్యాండ్మైన్లు “రష్యన్ దాడులను ఆపడానికి… అత్యవసరం…” అని ‘ది గార్డియన్’ నివేదించింది. అంతకుముందు, యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ మాట్లాడుతూ, మారుతున్న రష్యా వ్యూహాలను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ కోసం యాంటీ పర్సనల్ ల్యాండ్మైన్లపై వాషింగ్టన్ విధానంలో మార్పు అవసరమని పేర్కొన్నారు.

More Stories
ఆసియాన్ సదస్సులో వర్చువల్ గా మోదీ
రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు
మహిళల కోసం జైషే ఆన్ లైన్ ‘జీహాదీ కోర్స్’