వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి జస్టిస్ అమర్నాథ్ గౌడ్

వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి జస్టిస్ అమర్నాథ్ గౌడ్
త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ కు అరుదైన ఘనత దక్కింది. న్యాయమూర్తిగా అత్యధిక కేసులు పరిష్కరించి రికార్డు సృష్టించిన జస్టిస్ అమర్నాథ్ గౌడ్ వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డుల్లోకి ఎక్కారు. ఈ సందర్భంగా జస్టిస్ అమర్నాథ్ గౌడ్కు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ  రాజ్భవన్లో అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ను ప్రదానం చేశారు.
 
జస్టిస్ అమర్నాథ్ గౌడ్ 2017 నుంచి ఇప్పటివరకు 91 వేల 157 కేసులు పరిష్కరించారు. రోజుకు సరాసరి 109 కేసులను పరిష్కరించి రికార్డు సృష్టించారు. హైదరాబాద్కు చెందిన జస్టిస్ అమర్నాథ్ గౌడ్ 2017లో తెలంగాణ, ఏపీ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2021 అక్టోబరు 28న త్రిపుర హైకోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు.

జస్టిస్ అమర్నాథ్ గౌడ్ 2022 నవంబరు 11 నుంచి 2023 ఏప్రిల్ 16 వరకు త్రిపుర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ హైకోర్టులో 40 శాతం పెండింగు కేసులను, త్రిపుర హైకోర్టులో 60 శాతం పెండింగు కేసులను పరిష్కరించారు.

“జస్టిస్‌ అమర్‌నాథ్‌ గౌడ్‌ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి చెప్పుకోదగ్గ రికార్డును సాధించారు. 2017 నుంచి 2024 వరకు హైదరాబాద్, త్రిపుర హైకోర్టులలో 91,157 వ్యక్తిగత కేసులను పరిష్కరించడంలో వారి అసాధారణమైన విజయాన్ని మేము గుర్తించాం, రోజుకు సగటున 109 కేసులను పరిష్కరించారు. మీ అత్యుత్తమ నిబద్ధత న్యాయ సాధనలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది” అని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ తెలిపింది.

రాజ్భవన్లో జరిగిన కార్యక్రమానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ సంస్థ భారతదేశ కోఆర్డినేటర్ బింగి నరేంద్ర గౌడ్, లయన్ విజయలక్ష్మి పాల్గొన్నారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్లో చోటు సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.