కాగా, 2024 సంవత్సరానికి గాను ఏఎన్నార్ జాతీయ పురస్కారాన్ని అక్కినేని ఫౌండేషన్ చిరంజీవికి ప్రదానం చేసింది. పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు ఎన్ని అందుకున్నా అక్కినేని జాతీయ పురస్కారం అందుకోవడంతోనే తాను ఇంట గెలిచానని మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. తన నట జీవితానికి సంపూర్ణత చేకూరిందని ఆనందం వ్యక్తం చేశారు.
భారతీయ సినీ రంగంలో బాద్షా లాంటి అమితాబ్చన్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం ఎంతో గర్వంగా ఉందని చెప్పారు చిరంజీవి. తనకు గురువు, మార్గదర్శి, స్ఫూర్తి ప్రదాత అమితాబచ్చన్కు ధన్యవాదాలు తెలిపారు. అక్కినేని కుటుంబం తనపై చూపించే ప్రేమ, అప్యాయతలకు ఎప్పటికి దాసుడనేనన్న మెగాస్టార్, భగవంతుడు తనకు ఇచ్చిన అద్భుతమైన స్నేహిడుతు నాగార్జున అని అభివర్ణించారు. ఈ సందర్భంగా తన తల్లి అంజనాదేవి అక్కినేని సీనియర్ అభిమానుల్లో ఒకరని గుర్తుచేసుకున్నారు.
‘చిరంజీవి, నాగార్జున, నాగ్ అశ్విన్ తదితరులు తమ సినిమాల్లో నన్ను భాగం చేశారు. తెలుగు చలన చిత్ర రంగంలో నేనూ సభ్యుడినే అని గర్వంగా చెప్పుకోగలను. ఇప్పటి నుంచి నన్నూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో భాగంగా పరిగణించండి. వచ్చే సినిమాలోనూ నాకు అవకాశం ఇవ్వడాన్ని మర్చిపోవద్దు . అవార్డు అందజేత విషయంలో నాకు ఈ గౌరవం కల్పించిన అక్కినేని నాగేశ్వరరావు ఫౌండేషన్, నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు’ అని అమితాబ్ బచ్చన్ తెలిపారు.
కాగా, ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబసభ్యులతో సహా, చిరంజీవి తల్లి అంజనాదేవి, విక్టరీ వెంకటేశ్, రామ్చరణ్, నాని, సుబ్బిరామి రెడ్డి, నిర్మాత అశ్వినీదత్, బోయపాటి శ్రీను, నాగ్ అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.

More Stories
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు
స్థానిక ఎన్నికలపై హైకోర్టు కోసం ఎదురుచూపు!
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు