
కాగా, ఈనెల 1న ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. దాదాపు 200 మిసైల్స్ను టెల్అవీవ్పై ప్రయోగించింది. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ అప్పట్లోనే ప్రతిజ్ఞ చేసింది. తాజాగా ఇరాన్పై ఐడీఎఫ్ ఎదురుదాడులతో విరుచుకుపడింది. మరోవైపు తాజా దాడులపై ఇరాన్ స్పందించింది.
మూడు సైనిక స్థావరాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు తెలిపింది. ఈ దాడుల్లో పరిమితి స్థాయిలో మాత్రమే నష్టం వాటిల్లిందని వెల్లడించింది. ఈ మేరకు ఇరాన్ మిలిటరీ ప్రకటన చేసింది. మరోవైపు ఐడీఎఫ్ ప్రతీకార దాడుల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్కు రాకపోకలు సాగించే అన్ని విమానాలను రద్దు చేసింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, భద్రతా సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తదుపరి నోటీసులు వచ్చే వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ పౌర విమానయాన సంస్థ ప్రతినిధి జాఫర్ యాజర్లౌ వెల్లడించారు. అన్ని మార్గాల్లోని విమానాలను రద్దు చేసినట్లు స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్పై ఇరాన్ తరచూ దాడులకు దిగుతున్నది, ప్రతీకరంగా ఎదురు దాడులు ప్రారంభించామని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ తెలిపారు. ప్రస్తుతం ఇరాన్లోని సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఖచ్చితమైన దాడులు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు.
ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్ చేసిన దాడులకు ప్రతిస్పందనగా ఐడీఎఫ్ దాని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రపంచంలోని అన్ని సార్వభౌమ దేశాల మాదిరిగానే ఇజ్రాయెల్కు ప్రతిస్పందించే హక్కు, బాధ్యత ఉందన్నారు. మా దేశాన్ని, ప్రజలను రక్షించుకునేందుకు ఏదైనా చేస్తామని స్పష్టం చేశారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు