ఇరాన్‌ సైనిక స్థావరాలపై ఇజ్రాయిల్ బాంబుల వర్షం

ఇరాన్‌ సైనిక స్థావరాలపై ఇజ్రాయిల్ బాంబుల వర్షం
ఇరాన్‌ పై ప్రతికారేచ్చతో రగిలిపోతున్న ఇజ్రాయెల్‌ అన్నంత పనీ చేసింది. టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలే లక్ష్యంగా శనివారం తెల్లవారుజామున నుంచి ఇజ్రాయెల్‌ దళాలు విరుచుకు పడ్డాయి. ఈ దాడుల్లో ఇద్దరు సైనికులు మరణించినట్లు ఇరాన్‌ తాజాగా ప్రకటించింది.
 
టెహ్రాన్ సమీపంలో పేలుళ్లు స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:15 గంటలకు వెలువడటం ప్రారంభించాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాలు “ఇజ్రాయెల్ కు  వ్యతిరేకంగా ఇరాన్ పాలన నుండి నెలల తరబడి నిరంతర దాడులకు” ప్రతిస్పందనగా, దాడి చేస్తున్నట్లు ధృవీకరిస్తూ ఒక ప్రకటనను త్వరగా విడుదల చేశాయి.
 
దాడిని ఎదుర్కోవడంలో ఇరాన్ తక్కువ సామర్థ్యాన్ని చూపడంతో, అనేక గంటల వ్యవధిలో, ఇరాన్‌లోని వివిధ ప్రాంతాలలో అనేక అలలుగా దాడులు జరిగాయి. టెహ్రాన్, కరాజ్, ఇస్ఫహాన్, షిరాజ్ ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటే, ఐడిఎఫ్ స్వేచ్ఛా కార్యకలాపాలను నిర్ధారించడానికి, తదుపరి దాడులకు పునాది వేయడానికి ఇరాన్ వైమానిక రక్షణ సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు మొదటి దాడులు స్పష్టంగా ఉన్నాయి.
 
 తదుపరి తరంగాలు డ్రోన్, బాలిస్టిక్ క్షిపణి తయారీ ప్రదేశాలను తాకాయి.  ఏప్రిల్ 14, అక్టోబర్ 1 న ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష ఇరాన్ దాడులలో వీటిని ఉపయోగించారు. అలాగే అటువంటి ఆయుధాలను ప్రయోగించడానికి ఉపయోగించే ప్రదేశాలు. 

కాగా, ఈనెల 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. దాదాపు 200 మిసైల్స్‌ను టెల్‌అవీవ్‌పై ప్రయోగించింది. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్‌ అప్పట్లోనే ప్రతిజ్ఞ చేసింది. తాజాగా ఇరాన్‌పై ఐడీఎఫ్‌ ఎదురుదాడులతో విరుచుకుపడింది. మరోవైపు తాజా దాడులపై ఇరాన్‌ స్పందించింది. 

మూడు సైనిక స్థావరాలను ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు తెలిపింది. ఈ దాడుల్లో పరిమితి స్థాయిలో మాత్రమే నష్టం వాటిల్లిందని వెల్లడించింది. ఈ మేరకు ఇరాన్‌ మిలిటరీ ప్రకటన చేసింది. మరోవైపు ఐడీఎఫ్‌ ప్రతీకార దాడుల నేపథ్యంలో ఇరాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌కు రాకపోకలు సాగించే అన్ని విమానాలను రద్దు చేసింది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, భద్రతా సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తదుపరి నోటీసులు వచ్చే వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇరాన్‌ పౌర విమానయాన సంస్థ ప్రతినిధి జాఫర్‌ యాజర్లౌ వెల్లడించారు. అన్ని మార్గాల్లోని విమానాలను రద్దు చేసినట్లు స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ తరచూ దాడులకు దిగుతున్నది, ప్రతీకరంగా ఎదురు దాడులు ప్రారంభించామని ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి డేనియల్‌ హగారీ తెలిపారు. ప్రస్తుతం ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఖచ్చితమైన దాడులు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. 

ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌ చేసిన దాడులకు ప్రతిస్పందనగా ఐడీఎఫ్‌ దాని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రపంచంలోని అన్ని సార్వభౌమ దేశాల మాదిరిగానే ఇజ్రాయెల్‌కు ప్రతిస్పందించే హక్కు, బాధ్యత ఉందన్నారు. మా దేశాన్ని, ప్రజలను రక్షించుకునేందుకు ఏదైనా చేస్తామని స్పష్టం చేశారు.

  కాగా, ఇరాన్‌పై ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ చేస్తున్న వైమానిక దాడుల్లో అమెరికా ప్రమేయం లేదని అమెరికాకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. అయితే ఈ దాడులకు సంబంధించి అమెరికాకు ముందే సమాచారం ఉన్నట్లు సమాచారం