
ఆన్లైన్ స్కామ్ల నుండి ఎలా సురక్షితంగా ఉండాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మెటా గురువారం ‘స్కామ్ సే బచో’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు కీలకోపన్యాసం చేశారు. మెటా చొరవతో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ల సహకారంతో ఈ కార్యక్రమం ప్రారంభింభిస్తున్నట్లు చెప్పారు.
పెరుగుతున్న స్కామ్లు, సైబర్ మోసాలను ఎదుర్కోవడానికి, పెరుగుతున్న ఆన్లైన్ స్కామ్ల కేసులను పరిష్కరించడానికి, సైబర్ భద్రతను పెంపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఆన్లైన్ స్కామ్ల కారణంగా పెరుగుతున్న ముప్పు నుండి భారతీయ పౌరులను రక్షించడానికి ఈ ప్రచారం సమయానుకూలమైన, చాలా అవసరమైన అడుగు అని జాజు చెప్పారు. ఇది డిజిటల్ భద్రత, విజిలెన్స్ సంస్కృతిని పెంపొందించడానికి మొత్తం ప్రభుత్వ విధానాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.
900 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులతో భారతదేశం, డిజిటల్ ఇండియా చొరవ కింద అసాధారణమైన డిజిటల్ వృద్ధిని సాధించిందని, యుపిఐ లావాదేవీలలో గ్లోబల్ లీడర్గా మారిందని ఐ & బి సెక్రటరీ తెలిపారు. అయితే, 2023లో 1.1 మిలియన్ సైబర్ మోసాల కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీటిని ఎదుర్కోవడానికి, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.
More Stories
500 బిలియన్ డాలర్ల సంపద కలిగిన తొలి వ్యక్తిగా ఎలాన్ మస్క్
దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో నటుడు విశాల్ బ్రహ్మ అరెస్ట్