
‘డెలావేర్లోని తన నివాసానికి బైడెన్ నన్ను తీసుకెళ్లారు. ఆయన ప్రేమ, వాత్సల్యం నా హృదయాన్ని స్పృశించింది. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం. మీ విజయాల వల్లే ఈ గౌరవం సాధ్యమైంది” అంటూ ప్రవాస భారతీయులను ఉద్దేశించి స్పష్టం చేశారు. అమెరికాలో నివసిస్తున్న వేల మంది ప్రవాస భారతీయులే, భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్లు పేర్కొంటూ భారత్, అమెరికా కలిసి ప్రజాస్వామ్య పండగలో భాగస్వాములయ్యాయని చెప్పారు.
ప్రవాస భారతీయుల సదస్సులో, భారత్ డిజిటల్ విప్లవాన్ని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా యూపీఐ, 5జీ నెట్వర్క్ అమలు జరుగుతున్న తీరును ఆయన వివరించారు. “5జీ నెట్వర్క్ అమలులో అమెరికా కంటే భారత్ ఎంతో ముందుంది. రెండేళ్లలోనే 5జీ నెట్వర్క్ దేశమంతటా అంతటా విస్తరించింది” అని తెలిపారు.
డిజిటల్ వ్యాలెట్స్ను భారతీయులు ఇప్పుడు బాగా ఉపయోగిస్తున్నారని, ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ ‘యూపీఐ’ భారత్లో ఉందని మోదీ చెప్పారు. ‘మేడిన్ ఇండియా సెమీకండక్టర్లు’ ప్రపంచ వ్యాప్తంగా విక్రయించడానికి ఎంతో దూరం లేదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక భారతీయుల ‘నమస్తే’ అనే పదం ప్రపంచవ్యాప్తం అయిందని, ఆ పదం లోకల్ నుంచి గ్లోబల్కు వెళ్లిందని తెలిపారు.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్లకు భారత్ హెచ్చరిక