
ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం ఎపి రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా, అల్లంపాడుకు చెందిన ఎర్రగంటి లోకేష్ మణికొండలో ఉంటూ నగరంలో ఓ ఐటి కంపెనీ పనిచేసేవాడు. గంజాయికి బానిసగా మారడంతో సంస్థ ఉద్యోగం నుంచి తీసివేసింది. గంజాయి తీసుకునేందుకు డబ్బులు లేకపోవడంతో గంజాయి విక్రయదారుడిగా అవతారం ఎత్తాడు.
ధూల్పేట తదితర ప్రాంతాల్లో నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి 20 గ్రాముల గంజాయిని రూ.2,000లకు విక్రయిస్తున్నాడు. మణికొండ ప్రాంతంలో ఒక గృహంలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం రావడంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది దాడులు చేయగా 1.74కిలోల గంజాయి లభించింది.
లోకేష్కు గంజాయి కూకట్పల్లిలో ఉంటున్న నెల్లూరుకు చెందిన శ్రీకాంత్ గంజాయి సరఫరా చేస్తున్నాడు, అతడిపై కూడా ఎక్సైజ్ సిబ్బంది కేసు నమోదు చేశారు. కాగా ఎస్ఆర్ నగర్లోని పిజి హాస్టల్పై దాడి చేసి గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.2 కేజీల గంజాయి, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఎపిలోని గుంటూరు జిల్లా, మాచర్లకు చెందిన పవన్, నెల్లూరు జిల్లా, కనుకలగుంటకు చెందిన కొలి మణికంఠ చౌదరి కలిసి గంజాయి విక్రయాస్తున్నారు. ఐఐటిలో ఇంజనీరింగ్ చదువుతున్న పవన్ గంజాయికి బానిసగామారి చదువును మధ్యలో ఆపివేశాడు. ఎస్ఆర్ నగర్లోని వినాయక ఎగ్జిక్యూటీవ్ పిజి హాస్టల్లో ఉంటూ గంజాయి విక్రయిస్తున్నాడు.
గంజాయి తీసుకునేందుకు డబ్బులు లేకపోవడంతో గంజాయి ఎపిలోని అరకుకు చెందిన కమలేష్, అమోష్ వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి నగరంలో 20 గ్రాములను వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్నాడు. పిజీ హాస్టల్లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం రావడంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది హాస్టల్పై దాడి చేసి అరెస్టు చేశారు.
వీరి నుంచి గంజాయిని కొనుగోలు చేసిన 22 మందిని గుర్తించిన ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది వారిపై కేసులు నమోదు చేశారు. వీరికి గంజాయి సరఫరా చేసిన విశాఖ, అరకుకు చెందిన కమలేష్, అమోష్లపై కూడ కేసు నమోదు చేశామని ఎక్సైజ్ సిబ్బంది తెలిపారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి