
వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తే నాగ్పూర్- సికింద్రాబాద్ మధ్య ప్రయాణ సమయం తగ్గనున్నది. రెండు నగరాల మధ్య 578 కిలోమీటర్ల ఉండగా.. రైలు 7.15 గంటల్లోనే గమ్యస్థానం చేరనున్నది. నాగ్పూర్లో రైలు ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం ఒంటిగంటకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 8.20 గంటలకు నాగ్పూర్ చేరుకోనున్నట్లు తెలుస్తున్నది. ఈ రైలు కాజీపేట్, రామగుండం, బల్హర్షా, చంద్రాపూర్, సేవ్గ్రామ్ స్టేషన్లలో ఆగనున్నది రైల్వేశాఖ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి మహారాష్ట్ర, తెలంగాణ మధ్య వేలాది మంది నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు.
ఎక్కువగా వివిధ వ్యాపారాల నిమిత్తం నాగ్పూర్ ప్రాంతానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో నాగ్పూర్- సికింద్రాబాద్ మార్గంలో సెమీహైస్పీడ్ రైలును నడిపేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తే రెండురాష్ట్రాల మధ్య కనెక్టివిటీ మరింత పెరిగే అవకాశం ఉన్నది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్ వరకు పలు రైళ్లు నడుస్తున్నాయి. ఇవన్నీ సికింద్రాబాద్ మీదుగా ఢిల్లీతో పాటు పలు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. వందే భారత్ రైలు కేవలం రెండు నగరాల మధ్యనే రాకపోకలు సాగించనున్నది.
More Stories
కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టేయండి
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం దక్షిణ తెలంగాణకు శాపం!
మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం