
కాగా, ఈ సంఘటన నేపథ్యంలో ముస్లిం సంక్షేమ కమిటీ ప్రతినిధులు గురువారం సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భూపేందర్ కుమార్ అట్రీని కలిశారు. అనధికారిక భాగాన్ని సీల్ చేయాలని కోరారు. అలాగే కోర్టు తీర్పునకు అనుగుణంగా అక్రమ నిర్మాణాన్ని తామే కూల్చివేస్తామని తెలిపారు. ఈ మేరకు మెమోరాండం సమర్పించారు.
మరోవైపు ఈ ప్రాంతంలో నివసిస్తున్న ముస్లింలు హిమాచల్ ప్రదేశ్లో శాశ్వత నివాసితులని ముస్లిం కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో మత సామరస్యం, సోదరభావాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముస్లిం సంక్షేమ కమిటీ సభ్యుడు ముఫ్తీ మహ్మద్ షఫీ కాస్మీ మీడియాతో అన్నారు. తమపై ఎవరి ఒత్తిడి లేదని ఆయన చెప్పారు.
కాగా, మసీదులో అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చిన దేవ్ భూమి సంఘర్ కమిటీ ఈ చర్యను స్వాగతించింది. ‘ముస్లిం సమాజం చర్యను మేం స్వాగతిస్తున్నాం. పెద్ద ఆసక్తితో ఈ చొరవ తీసుకున్నందుకు వారిని కౌగిలించుకునే మొదటి వ్యక్తి నేనే అవుతా’ అని కమిటీ సభ్యుడు విజయ్ శర్మ తెలిపారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్