
ఇ-కామర్స్ సంస్థలు సామాజిక అంతరానికి కారణమవుతున్నాయని పీయూష్ గోయల్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇ-కామర్స్ నెట్వర్క్ వల్ల రాబోయే పదేళ్లలో సగం మార్కెట్ అవే ఆక్రమించడాన్ని విజయంగా భావించకూడదని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇ-కామర్స్ సంస్థలు పోటీని నివారించేందుకు అనుసరిస్తున్న ధరల విధానం వల్ల సంప్రదాయ రిటైల్ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ తరహా ధరల విధానం దేశానికి మంచిదా? అని ప్రశ్నించారు. ముఖ్యంగా పెద్దపెద్ద ఇ-కామర్స్ సంస్థల పెట్టుబడి వ్యూహాలపై పీయూష్ గోయల్ విమర్శలు గుప్పించారు.
బడా సంస్థలు భారత్లో బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నామని ప్రకటించగానే మనం సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటామని, వాస్తవానికి ఆ పెట్టుబడులు సేవలకో, భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికో కాదని స్పష్టం చేశారు. తమ బ్యాలెన్స్ షీట్లోని నష్టాల భర్తీకి ఆ మొత్తాలను వినియోగిస్తున్నాయని ఆయన చెప్పారు.
తమపై ఎవరూ న్యాయ పోరాటానికి దిగకుండా బడా లాయర్లకు ఈ సంస్థలు కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటాయని పీయూష్ గోయల్ తెలిపారు. ఒక ఏడాదిలో రూ.6 వేల కోట్ల నష్టం వచ్చిందంటే అది పోటీని తప్పించే ధరల విధానం కాక మరేమవుతుందని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. వాస్తవానికి ఇ-కామర్స్ సంస్థలు బిజినెస్ టు కస్టమర్ వ్యాపారాన్ని (బి2సి) నిర్వహించకూడదని ఆయన స్పష్టం చేశారు.
More Stories
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు
ట్రంప్ బెదిరింపులతో ఐటి రంగంపై భారత్ దృష్టి