మీ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ కూడా లేటరల్ ఎంట్రీలో భాగమేనని చెప్పారు. ఇలాంటి వందలాది ఉదాహరణలు కనిపిస్తాయని, లేటరల్ ఎంట్రీని తీసుకొచ్చిందే మీరని రాహుల్ను ఉద్దేశించి కేంద్ర మంత్రి పేర్కొన్నారు. లేటరల్ ఎంట్రీని మీరు ప్రారంభిస్తే దాన్ని మోదీ క్రమబద్ధీకరణ చేశారని చెప్పారు.2005లో పరిపాలనా సంస్కరణల కమిషన్ ఏర్పాటైందని, దాని నివేదిక బయటకువచ్చిందని తెలిపారు. 2005 నుంచి యూపీఏ అధికారంలో ఉందని గుర్తుచేశారు. తాము రిజర్వేషన్లకు చరమగీతం పాడతామని చెబుతున్నారని, అసలు మీరు ఎప్పుడు నియామకాలు చేపట్టారని మీరు ఏం చేశారని కేంద్ర మంత్రి నిలదీశారు.
కాంగ్రెస్కు హఠాత్తుగా ఓబీసీలపై ప్రేమ పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు. లోక్సభలో రాహుల్ గాంధీ స్వయంగా తాను ఓబీసీ రిజర్వేషన్కు వ్యతిరేకమని చెప్పారని, కానీ ఇప్పుడు కాంగ్రెస్కు ఓబీసీలపై ప్రేమ పుట్టుకొచ్చిందని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్ధులను కాంగ్రెస్ తప్పుదారిపట్టిస్తోందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దుయ్యబట్టారు.
మరోవంక, వివిధ మంత్రిత్వ శాఖల్లో పోస్టులను లేటరల్ ఎంట్రీ విధానంలో భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించడంపై ఎన్డీయేలో విభేదాలు తలెత్తాయి. ఈ విధానాన్ని బీజేపీ మిత్ర పక్షాలైన జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ-రాం విలాస్) వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తప్పనిసరి అని, ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని ఎల్జేపీ నాయకుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాసవాన్ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా దీనిని తగిన వేదికపై ప్రస్తావిస్తానని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం ఆందోళన కలిగించే విషయమని జేడీయూ జాతీయ అధికార ప్రతినిధి కేసీ త్యాగి పేర్కొన్నారు.

More Stories
వందల మొబైల్ ఫోన్లు పేలడంతో బస్సు ప్రమాదం?
అమెరికా గుప్పిట్లో పాక్ అణ్వాయుధాలు
కశ్మీర్ రాజ్యసభ ఎన్నికల్లో ఎన్సీని అడ్డుకున్న బీజేపీ