
* ప్రధానికి కృష్ణ మాదిగ ధన్యవాదాలు
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంపన్న శ్రేణిని (క్రీమీలేయర్) వర్తింపజేయకూడదని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోకూడదని నిశ్చయించింది. శుక్రవారం రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
‘‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లలో క్రీమీలేయర్ నిబంధన లేదు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు చేసిన నిర్దిష్టమైన సూచనలపై క్యాబినెట్లో పూర్తిస్థాయిలో చర్చించాం. మేధో మథనం తర్వాత.. రాజ్యాంగంలో ఉన్న నిబంధనలకే కట్టుబడి ఉండాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది’’ అని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ నిబంధనలన్నీ రాజ్యాంగం ప్రకారమే ఉంటాయని పునరుద్ఘాటించారు.ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఇటీవల సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. రాష్ట్రాలు తమ పరిధిలో వర్గీకరణ చేసుకోవచ్చని తెలిపింది. అదే సమయంలో, ఎస్సీ, ఎస్టీల్లో క్రీమీలేయర్ను గుర్తించడానికి ఓ విధానాన్ని నిర్దేశించుకోవాలని, రిజర్వేషన్లలో నిజమైన సమానత్వం సాధించడానికి ఇదే మార్గమని కూడా వ్యాఖ్యానించింది.
More Stories
ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్
శతాబ్ది సందర్భంగా `పంచ పరివర్తన్’పై ఆర్ఎస్ఎస్ దృష్టి
అక్టోబర్ 26 నుంచి భారత్- చైనాల మధ్య విమాన సర్వీసులు