
ఇలాఉండగా, బంగ్లాదేశ్ కొనసాగుతున్న హింసాకాండను ప్రస్తావిస్తూ . భారత్కు సంబంధించినంత వరకు బంగ్లాదేశ్ పౌరుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తుందని విదేశాంగ స్పష్టం చేసింది. శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం ఆశిస్తున్నామని పేర్కొంది.
బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులకు సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో మైనారిటీల పరిస్థితిపై సమాచారం తీసుకుంటున్నామని తెలిపారు. బంగ్లాలోని కొన్ని సంఘాలు మైనారిటీలకు సహాయం చేస్తున్నాయని తమకు సమాచారం అందిందని, ఆయా చర్యలను స్వాగతిస్తున్నామని చెప్పారు. అయితే, బంగ్లాదేశ్లో పౌరులందరికీ భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేయాలనుకుంటున్నామని తెలిపారు.
బంగ్లాదేశ్లో తాజా పరిస్థితులపై రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ మళ్లీ బంగ్లాదేశ్లో పరిస్థితి దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవంలో భారత్ తరఫున తమ రాయబారి సైతం పాల్గొంటారని చెప్పారు. బంగ్లాదేశ్ పౌరుల భద్రత భారత ప్రభుత్వానికి, ప్రజలకు అత్యంత ప్రాధాన్యత అని చెబుతున్నామని పేర్కొన్నారు.
బంగ్లాదేశ్లో పరిస్థితికి సంబంధించి బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మధ్య చర్చ జరిగిందని వెల్లడించారు. బంగ్లాదేశ్, పశ్చిమాసియాలో పరిస్థితి పురోగతిపై ఇరువురు నేతలు చర్చించారని తెలిపారు.
More Stories
ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి వచ్చే వారం భారత్ లో పర్యటన
అక్టోబర్ 26 నుంచి భారత్- చైనాల మధ్య విమాన సర్వీసులు
విదేశీ విద్యార్థులపై ట్రంప్ కొత్త మెలిక