
సాగునీటి ప్రాజెక్టుల పైనే గత ఐదేళ్లలో ఎక్కువ ఖర్చులు చేశారని తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ రిపోర్ట్ అసెంబ్లీలో శుక్రవారం ముందుకు వచ్చింది. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులకు భారీగా ఖర్చు చేసినట్టు పేర్కొంది. తీసుకున్న రుణాలు చెల్లించడానికే ఎక్కువ ఖర్చులు చేసినట్టు పేర్కొంది.కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలను మళ్ళీ అప్పులు చెల్లించడానికి వినియోగించినట్టు తెలిపింది.
గత ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన పరిమితి కన్నా 6శాతం ఎక్కువ రుణాలు తీసుకున్నదని తెలిపింది. గత సంవత్సరం బడ్జెట్ లో పన్నేతర రాబడి అంచనాలు ఎక్కువగా వేశారని పేర్కొన్నది. రెవెన్యూ రాబడులు గణనీయంగా 25 శాతం మేర పెరిగాయని తెలిపింది. సొంత పన్నుల రాబడి 17 శాతం పెరిగిందని తెలిపింది. సొంత రాబడి లేని సంస్థలకు ప్రభుత్వం రుణాలు ఏర్పాటు చేసిందని పేర్కొంది.
2022 -23 బడ్జెట్ వెలుపలి రుణాలు రూ.1,18,629 కోట్లుగా అంచనా వేసిందన్నారు. రాష్ట్రాభివృద్ధి రుణాలపై వడ్డీపై ఖర్చును తక్కువగా అంచనా వేశారని తెలిపింది. కేంద్రం నుంచి భారీగా గ్రాంట్లు వస్తాయని అంచనా వేశారని తెలిపింది. ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్ కంపెనీలకు బకాయిలు వస్తాయని పేర్కొన్నా రాలేదని తెలిపింది. ఇండ్లు, గొర్రెల పంపిణీ, ఆయిల్ పామ్ పథకాల నిధులు కేటాయించినట్టు చూపించినా ఖర్చు కాలేదని వివరించింది.
కాగా, శాసనసభ ఎజెండాను అర్ధరాత్రి ఇవ్వడం పట్ల ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎజెండా ఒకటి ఇస్తున్నారని, సభలో మరొక దానిపై చర్చ నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రస్తావించారు. ఒక్క రాజకీయ పార్టీ కోరికల మీద, ఇష్టం మీద అసెంబ్లీ నడవకూడదని, అందరిని పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
More Stories
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!
సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?