
బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.19 శాతం, 0.58 శాతం క్షీణించాయి. మార్కెట్ పతనంతో శుక్రవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ. 5 లక్షల కోట్లను నష్టపోయారు. బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గురువారం సెషన్లో దాదాపు రూ. 462 లక్షల కోట్లు ఉండగా, శుక్రవారం సెషన్ ముగిసే సమయానికి రూ. 457 లక్షల కోట్లకు పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్లు కేవలం ఒక సెషన్లో సుమారు 5రూ. లక్షల కోట్లను కోల్పోయారు.
నిఫ్టీ 50 సూచీలో 42 షేర్లు ఎరుపు రంగులో ముగిశాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ లో ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, మారుతి షేర్లు టాప్ లూజర్స్ గా ముగిశాయి. అస్థిరత సూచీ ఇండియా విఐఎక్స్ 11 శాతానికి పైగా పెరిగి 14.41 కు చేరుకుంది. ఇది మార్కెట్ భాగస్వాములలో పెరుగుతున్న భయాందోళనలను సూచిస్తుంది.
ప్రధాన సెక్టోరల్ ఇండెక్స్ లలో నిఫ్టీ రియల్టీ 3.5 శాతం, ఆటో, మెటల్ దాదాపు 3 శాతం చొప్పున నష్టపోయాయి. ఐటీ ఇండెక్స్ 2 శాతానికి పైగా నష్టపోయింది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 0.41 శాతం, ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 0.39 శాతం క్షీణించాయి. మరోవైపు పీఎస్ యూ బ్యాంక్ ఇండెక్స్ 1.72 శాతం నష్టపోయింది.
More Stories
జీఎస్టీ సంస్కరణలతో తగ్గనున్న ఆహార వస్తువుల ధరలు
భారీ సైబర్ దాడితో నిలిచిపోయిన పలు దేశాల విమానాశ్రయాలు
హెచ్-1బీ వీసా రుసుం పెంచడంతో టెక్ సంస్థలు అప్రమత్తం