
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా, రుచికరంగా అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నామని, ఈ చర్యల వలన లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యత పెరిగిందని టీటీడీ ఈవో జే.శ్యామలరావు చెప్పారు. అదేవిధంగా తక్కువ నాణ్యత గల నెయ్యిని సరఫరా చేస్తున్న సరఫరాదారులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు.
కాగా, ప్రస్తుత సప్లయర్స్ ను పిలిచి క్వాలిటీ నెయ్యి సరపరా చేయాలని సూచించినట్టు తెలిపారు. కొన్ని సంస్థలు హై క్వాలిటీ నెయ్యి పంపిస్తుండగా మరికొన్ని సంస్థలు నాసిరకం నెయ్యి అందిస్తున్నాయిని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెండు కంపెనీలపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. టెండర్ నిబంధనలను ఉల్లంఘించి ఓ కల్తీ నెయ్యి ఇస్తున్నట్లు, వెటిటబుల్ ఫ్యాట్ కలుపుతున్నట్లు తేలిందని ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టామని మరో కంపెనీపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ రెండు కంపెనీలకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు ఆయన వివరించారు.
ఇక, ప్రస్తుతానికి అడల్ట్రేషన్ టెస్ట్ చేసే పరికరం టీటీడీ వద్ద లేదని, త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముడి సరుకులు, నెయ్యి ప్రొక్యూర్మెంట్ విధానంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు సంబంధించి నలుగురు ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇందులో ఎన్డీఆర్ఏ విశ్రాంత ఆచార్యులు డా.సురేంద్రనాథ్, హైదరాబాద్ కు చెందిన డా.విజయ భాస్కర్ రెడ్డి, ప్రొఫెసర్ స్వర్ణలత, బెంగళూరుకు చెందిన డాక్టర్ మహదేవన్ ఉన్నారని చెప్పారు. ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక అందిస్తారని తెలిపారు. క్వాలిటీ నెయ్యి కోసం టెండర్ లో ఎలాంటి అంశాలు చేర్చాలని ఈ కమిటీ దిశా నిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు