
* స్వాగతించిన ఆర్ఎస్ఎస్
ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఇప్పటివరకు ఉన్న నిషేధాన్ని బీజేపీ ప్రభుత్వం ఇటీవలే ఎత్తివేసింది. కేంద్ర ప్రభుత్వం జులై 9న ఈ ఉత్తరువును జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్లో పాల్గొనకుండా 1966 నాటి నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో ఉంది.
మహాత్మా గాంధీ మరణం అనంతరం ఆర్ఎస్ఎస్పై 1948లో నాటి జవహర్ లాల్ నెహ్రు ప్రభుత్వం నిషేధించింది. అయితే ఆ నిషేధాన్ని ఆ తర్వాత తొలిగించారు. ఆ తర్వాత 1966లో ఆర్ఎస్ఎస్, జమాత్-ఈ- ఇస్లామీ వంటి సంస్థల కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటే, అది కేంద్ర సివిల్ సర్వీసెస్ రూల్స్కి వ్యతిరేకమని ఉత్తరువులు జారీచేశారు. ఇప్పుడు జులై 9న, 58ఏళ్ల పాటు ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది.
జులై 9 నాటి ఉత్తర్వులను బీజేపీ ఐటీ డిపార్ట్మెంట్ చీఫ్ అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్టు వెల్లడించారు. “58 ఏళ్ల క్రితం, 1966లో ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. ఇది అసలు జరిగి ఉండకూడదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. దీనిని మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీనిని నేను స్వాగతిస్తున్నాను,” అని అమిత్ చెప్పుకొచ్చారు.
More Stories
దేశంలో 14 శాతం పెరిగిన వరకట్నం కేసులు
బీహార్ లో తుది ఓటరు జాబితాను విడుదల చేసిన ఈసీ
క్యాన్సర్ పరిశోధనలో భారతీయ కుత్రిమ మేధ