![](https://nijamtoday.com/wp-content/uploads/2024/07/Rahul-LS1.jpeg)
‘రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలపై ప్రధాని మాత్రమే స్పందించే హక్కు ఉంది. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు హిందువుల పట్ల ద్వేషంతో మొదలై ద్వేషంతోనే ముగుస్తాయి. ఆయన బాటనే ఇండియా కూటమి నేతలు అనుసరిస్తారంటే ఆశ్చర్యమేమీ లేదు’ అని మరో ‘ఎక్స్’ పోస్టులో నిర్మలా సీతారామన్ తెలిపారు.
రాహుల్ గాంధీ విపక్ష నేతగా తొలిసారి ఈ బాధ్యతలను చేపట్టారని, కానీ ఇవాళ ఆయన బాధ్యతారాహిత్య ప్రకటన చేశారని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ విమర్శించారు. అమర వీరులకు ఎలాంటి పరిహారం చెల్లించడం లేదని ఆయన అసత్యాలు వల్లె వేశారని అన్నారు. ఇంతకంటే మరో పెద్ద అబద్ధం ఏదీ ఉండదని పేర్కొన్నారు. అమరవీరులకు రూ. కోటి పరిహారం అందిస్తున్నామని రక్షణ మంత్రి స్వయంగా సభలో వివరణ ఇచ్చారని గుర్తు చేశారు.
రాహుల్ మాంచి స్టాండప్ కమెడియన్
లోక్సభలో రాహుల్గాంధీ ప్రసంగించిన తీరు మాంచి స్టాండప్ కమెడియన్ను తలపించిందని బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ ఎద్దేవాచేశారు. ఆయన దేవుళ్లు, దేవతలను కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మార్చేశాడని మండిపడ్డారు. ఆఖరి పరమశివుడి అభయ హస్తాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ హస్తమే అని ఆయన చెప్పడం హాస్యాస్పదంగా అనిపించిందని ఆమె విమర్శించారు.
‘రాహుల్ గాంధీ మాంచి స్టాండప్ కమెడియన్. ఈ విషయాన్ని నేను ఇంతకుముందే చెప్పాను. ఆయన దేవుళ్లు, దేవతలు అందరినీ కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మార్చేశారు. ఆఖరికి పరమశివుడి అభయ హస్తం కూడా కాంగ్రెస్ పార్టీ హస్తమే అని ఆయన చెప్పడం హాస్యాస్పదం’ అని కంగనా ఎద్దేవా చేశారు. ‘ఇవీ ఆయన మాటలు. ఇది ఆయన ప్రసంగం. అందుకు మేం ఇప్పటికే నవ్వుకుంటున్నాం. అయితే ఈ వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్గాంధీ క్షమాపణలు చెప్పాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.
రాహుల్ సోమవారం లోక్సభలో డ్రామా సృష్టించాలని అనుకున్నారని, కానీ అది ఎలా చేయాలో ఆయనకు తెలియలేదని బీజేపీ ఎంపీ అరుణ్ గోవిల్ ఎద్దేవా చేశారు. డ్రామా అంటే కంటెంట్ను అర్ధం చేసుకోవడం కీలకమని చెప్పారు. రాహుల్ ఎదగలేదని, ఆయన ఇంకా పరిణితి చెందాల్సి ఉందని చెబుతూ ఇలాంటి విపక్ష నేతను చూడటం చికాకుగా ఉందని పేర్కొన్నారు.
అయితే, ఇక విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభ ప్రసంగంలో ఎక్కడా హిందువులను అవమానించలేదని రాహుల్ సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. తాను బీజేపీతో పాటు ఆ పార్టీ నేతల తీరు గురించే మాట్లాడానని రాహుల్ స్పష్టంగా చెప్పారని ఆమె గుర్తు చేశారు.
రహుల్గాంధీ చేసిన ప్రసంగాన్ని శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ మెచ్చుకున్నారు. ఆయన (రాహుల్ గాంధీ) చెప్పదల్చుకున్నదని కరెక్టుగా చెప్పారని ఆమె కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లను ఇప్పటికీ నెరవేర్చలేదని విమర్శించారు. తమకు న్యాయం చేయాలని పోరాడుతూ ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, వారికి కనీసం నష్టపరిహారం కూడా చెల్లించలేదని హర్సిమ్రత్ మండిపడ్డారు.
More Stories
త్వరలో విమానం మాదిరిగా 132 సీట్ల బస్సు
ఢిల్లీలో రోహిత్ సేనకు ఘనస్వాగతం
పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాల్సిందే