మణిపూర్లో తెగల మధ్య ఆరని చిచ్చుకు బ్రిటన్లో నివసిస్తున్న భారతీయ సంతతి వ్యక్తి కారణం అని వెల్లడైంది. ఉదయ్ రెడ్డి అనే ఈ వ్యక్తిపై స్థానికంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఉదయ్రెడ్డి బ్రిటన్లోని బర్మింగ్హామ్ వర్శిటీలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్గా ఉన్నారు.
మణిపూర్లో మతాల పేరిట ఆయన పలు వర్గాల నడుమ ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నాడని మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో ఉదయ్ రెడ్డిపై ఎప్ఐఆర్ దాఖలు అయింది. ఈ వ్యక్తి కెనడాలోని ఖలీస్థానీ శక్తులతో లింకులు పెట్టుకున్నాడని, మణిపూర్లో ఘర్షణలను రెచ్చగొడుతున్నాడని ప్రాధమిక సమాచారం అందింది.
దీనితో ఈ దిశలో మణిపూర్ పోలీసు బృందాలు విచారణకు సిద్ధం అయ్యాయి. మణిపూర్లో చాలా నెలలుగా మైతీలు, నాగాల కుకీ తెగల మధ్య ఘర్షణలు సాగుతున్నాయి. ఈ వ్యక్తి తన రాతలతో ఇతరత్రా మైతీల మతవిశ్వాసాలను రెచ్చగొట్టేలా వ్యవహరించాడని ఫిర్యాదులో వెల్లడైంది. ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో ఈ ఫిర్యాదు దాఖలు అయింది.
ఈ వ్యక్తి పనిచేస్తున్న బర్మింగ్హామ్ వర్శిటీకి ఇతని వివరాల గురించి తెలుసుకునేందుకు అధికారులు ఫోన్లు చేయగా అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఇక ఉదయ్ రెడ్డి నుంచి కూడా ఈ విషయంలో ఇప్పటివరకూ పత్రికా ప్రకటన వెలువడలేదు. వివరణ రాలేదు.
ఉదయ్ రెడ్డి ఆయన అనుచరుల చట్టవ్యతిరేక కార్యకలాపాలు దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రత సమైక్యతలకు భంగకరం అని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ కోణంలోనే ఆయనపై దర్యాప్తు వేగవంతం చేస్తామని అధికారులు తెలిపారు.
కాగా ఈ వ్యక్తికి ఖలీస్థానీ వర్గాలతో పాటు నార్కో టెర్రరిస్టు బృందాలతో కూడా సంబంధం ఉందని, నిందితుడి ఫోన్కాల్స్, ఆయన ఆర్థిక కార్యకలాపాలను ఆరాతీయాల్సి ఉంటుందని వెల్లడించారు. కాగా ఈ వ్యక్తి ఎక్స్ సామాజిక మాధ్యమం ఖాతా నిలిపివేసి ఉంది. రెడ్డి తరచూ సామాజిక మాధ్యమంలో పలువురితో ఫోన్లలో మాట్లాడటం, ఆడియో ప్రసంగాలకు దిగడం వంటి పనులు చేస్తున్నాడు.
More Stories
ఛత్తీస్గఢ్ భారీ ఎన్కౌంటర్ లో 11 మంది నక్సల్స్ మృతి
జగన్నాధ రథయాత్రకు భారీ ఏర్పాట్లు
సుప్రీంకోర్టును ఆశ్రయించిన నితీశ్ సర్కారు