![](https://nijamtoday.com/wp-content/uploads/2024/06/Gen-Dwedi-1024x682.webp)
కాగా, మధ్యప్రదేశ్కు చెందిన ఉపేంద్ర ద్వివేది, సైనిక్ స్కూల్ రేవాలో చదివారు. 1981 జనవరిలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే)లో చేరారు. 1984 డిసెంబర్లో జమ్ముకశ్మీర్ రైఫిల్స్ 18వ బెటాలియన్లో నియమితులయ్యారు. ఆ తర్వాత కశ్మీర్ లోయ, రాజస్థాన్ ఎడారులలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల బెటాలియన్కు నేతృత్వం వహించారు.
మరోవైపు ఇన్స్పెక్టర్ జనరల్ అస్సాం రైఫిల్స్, అస్సాం రైఫిల్స్ సెక్టార్ కమాండర్గా తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో ఉపేంద్ర ద్వివేది విశేష సేవలు అందించారు. ఈశాన్య ప్రాంత కమాండర్తోపాటు ఇండో-మయన్మార్ సరిహద్దు నిర్వహణ బాధ్యతలు వహించారు. ఆ తర్వాత రైజింగ్ స్టార్ కార్ప్స్ను కమాండ్ చేశారు. 2022-2024 వరకు సవాళ్లతో కూడిన వెస్ట్రన్ ఫ్రంట్, నార్తర్న్ ఆర్మీకి నేతృత్వం వహించారు.
భారత సైన్యాన్ని అత్యాధునిక ఆయుధాలతో ఆధునికీకరించేందుకు కృషి చేశారు. సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన సునీతా ద్వివేదిని ఆయన వివాహం చేసుకున్నారు. సునీతా ద్వివేది భోపాల్లోని దివ్యాంగ చిన్నారుల కోసం ఆరుషి అనే సంస్థను స్థాపించారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
More Stories
హిందువులపై రాహుల్ ఆరోపణలను ప్రజలు ఎప్పటికి క్షమించరు
లోక్సభలో రాహుల్ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు