
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ స్థానంలో పోటీ చేసి ఓడిన బీజేపీ అభ్యర్థి సుజయ్ విఖే పాటిల్ 40 పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను వెరిఫై చేయాలని కోరారు. ఏపీకి చెందిన వైఎస్సార్సీపీ, తమిళనాడుకు చెందిన డీఎండీకే అభ్యర్థి కూడా ఈవీఎంల తనిఖీ కోసం దరఖాస్తు చేశారు. ఇప్పటివరకు ఆరు రాష్ట్రాల్లోని ఎనిమిది పార్లమెంట్ స్థానాల నుంచి దరఖాస్తులు అందినట్లు ఈసీ తెలిపింది.
వెరిఫికేషన్ కోరిన మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 92 అని పేర్కొంది. అలాగే అసెంబ్లీ ఫలితాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు చెందిన వైఎస్సార్సీపీ, బీజేడీ అభ్యర్థులు ఈవీఎం చెకింగ్ కోసం దరఖాస్తు చేసినట్లు ఈసీ వెల్లడించింది. మరోవైపు ఈవీఎంలో అవకతవకలు జరుతున్నాయన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ను ఏప్రిల్ 26న తిరస్కరించింది.
అయితే ఫలితాల్లో రెండో, మూడో స్థానంలో నిలిచిన బాధిత అభ్యర్థులకు ఊరట ఇచ్చింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు శాతం ఈవీఎంల మైక్రో కంట్రోలర్ చిప్ తనిఖీ చేసేందుకు లిఖితపూర్వకంగా ఈసీకి దరఖాస్తు చేసేందుకు అనుమతించింది. అలాగే అందుకు అవసరమయ్యే ఖర్చులను ఈసీకి చెల్లించాలని పేర్కొంది.
కాగా, జూన్ 1న ఈసీ జారీ చేసిన విధివిధానాల ప్రకారం ఒక బ్యాలెట్ యూనిట్, ఒక కంట్రోల్ యూనిట్, ఒక వీవీపీఏటీ మెషీన్ కలిగిన ఒక్కో ఈవీఎం సెట్ తనిఖీ కోసం అభ్యర్థులు రూ.47,200 (రూ.40,000 తయారీ, జీఎస్టీతో కలిపి) చెల్లించాలి. ఈవీఎం వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు 2025 మార్చి 31 వరకు రుసుం చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పారదర్శకత దృష్ట్యా ఈవీఎంల నిర్వహణ, ఇతర ఆర్థిక వ్యయాలను పరిగణనలోకి తీసుకోలేదని ఈసీ పేర్కొంది.
More Stories
30 నాటికి ఎస్ఐఆర్ అమలుకు సిద్ధంగా ఉండండి
జమ్ముకశ్మీర్లో చైనా గ్రెనేడ్లు స్వాధీనం .. ఉగ్ర కుట్ర భగ్నం
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి