
బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ 2023 నవంబర్ లో నితీష్ కుమార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాట్నా హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.వినోద్ చంద్రన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ జరిపింది.
అనంతరం, ఆ రిజర్వేషన్ల పెంపు నిర్ణయం చెల్లదని పేర్కొంటూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్ల చట్టాల్లో చేసిన సవరణలు రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తాయని పిటిషనర్ల వాదనతో పాట్నా హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మార్చిలో తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు తుది ఉత్తర్వులను జారీ చేసింది.
2023 నవంబర్ లో, బీహార్ ప్రభుత్వం రెండు రిజర్వేషన్ బిల్లులకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బిల్లుల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచారు. ఈ నిర్ణయంతో, రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి చేరుకున్నాయి. ఇందులో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) అదనంగా అందిస్తున్న 10% రిజర్వేషన్లు కూడా ఉన్నాయి.
రాష్ట్రంలో నిర్వహించిన కుల గణన సర్వే ఫలితాల తరువాత, ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల (ఎస్సి) కోటాను 20 శాతానికి, షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) 2 శాతానికి, అత్యంత వెనుకబడిన తరగతుల (ఈబీసీ) 25 శాతానికి, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబిసి) కోటాను 18 శాతానికి పెంచింది. దీనిపై పలువురు హై కోర్టును ఆశ్రయించారు.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?