
గతంలో టెట్కు సంబంధించి రెండు వేర్వేరు ఉత్తర్వులున్నందున రెండింటినీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జికే వివాదాన్ని పంపింది. ఈ విషయం తెలిసి కూడా ప్రక్రియను ఎలా చేపడతారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. స్కూలు అసిస్టెంట్ పోస్టుల పదోన్నతుల్లో భాగంగా టెట్లో అర్హత సాధించని ఎస్జీటీలకు అవకాశం కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ 150 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారించిన సింగిల్ జడ్జి టెట్తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ 52 మంది హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. దీనిపై ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున వాదించిన న్యాయవాది రాజశేఖర్ టెట్ అర్హత లేనివారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పదోన్నతులకు అవకాశం కల్పిస్తే అన్యాయం జరుగుతుందని తెలిపారు.
ఐతే అభ్యర్థులు 1995- 2008 మధ్య ఎస్జీటీలుగా నియమితులయ్యారని ప్రతివాదుల తరఫున న్యాయవాది ఎం. రాంగోపాల్ రావు వాదించారు. కానీ ఎస్సీటీఈ నోటిఫికేషన్ 2010లో వచ్చిందని తెలిపారు. ఎస్సీటీఈ నిబంధనల ప్రకారం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెట్ అర్హత తప్పనిసరని,అందువల్ల నోటిఫికేషన్కు ముందు నియమితులైనవారికి టెట్ అవసరంలేదంటూ 2015లో ప్రభుత్వం జీవో 36 జారీ చేసిందని పేర్కొన్నారు. ఇందులో 12వ నిబంధన ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతోందని, తర్వాత కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెట్ తప్పనిసరని ఎప్పుడూ నోటీసు కూడా ఇవ్వలేదని తెలిపారు.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు