![](https://nijamtoday.com/wp-content/uploads/2024/06/Palla.jpeg)
ఇప్పటి వరకూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడుకు కేబినెట్ లో స్థానం దక్కింది. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు మరొకరికి అప్పగించాలని చంద్రబాబు భావించారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్నికల్లో విశాఖ జిల్లా గాజువాక నుంచి ఎమ్మెల్యే రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీగా గెలిచిన పల్లా శ్రీనివాసరావుకు రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోని అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో విజయం సాధించారు. విశాఖ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన పల్లా శ్రీనివాసరావు పార్టీ కోసం చాలా శ్రమించారు. ఒకానొక దశలో ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రత్యర్థులు ప్రచారం కూడా చేశారు. అయినా పార్టీని విడలేదు.
రాష్ట్ర విభజన అనంతరం టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇప్పటి వరకు రెండుసార్లు ఉత్తరాంధ్ర నేతలకే దక్కింది. రాష్ట్ర విభజన తర్వాత తొలసారిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావును చంద్రబాబు నియమించారు. అనంతరం గత ఐదేళ్లుగా ఉత్తరాంధ్రకే చెందిన అచ్చెన్నాయుడుకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు మరోసారి ఉత్తరాంధ్రకే చెందిన బీసీ నేత పల్లా శ్రీనివాసరావును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించారు.
More Stories
వైసిపి మాజీ ఎంపీ ఎంవివికి హైకోర్టులో చుక్కెదురు
శివ కుమార్ తో జగన్ చర్చలు.. స్పీకర్ ఎన్నికల్లో బిజెపికి మద్దతు!
ప్రతిపక్ష నాయకుడి హోదాకై వైఎస్ జగన్ డిమాండ్