జగన్ నివాసం వద్ద అక్రమ నిర్మాణాలు కూల్చివేత

హైదరాబాద్ లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద ఆక్రమణలో ఉన్న అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసి అధికారులు శనివారం కూల్చివేశారు. పోలీసు సెక్యూరిటీ కోసం నిర్మించిన మూడు షెడ్లను భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలను జీహెచ్‌ఎంసి అధికారులు చేపట్టారు.

లోటస్ పాండ్ వద్ద రోడ్డుకు అడ్డుగా నిర్మాణాలు వెలివాయి. ఇవి రోడ్డుపైనే ఉన్నాయన్న ఫిర్యాదు స్థానికుల నుంచి గ్రేటర్ అధికారులకు అందింది. గత శుక్రవారం ఆ నిర్మాణాదారులకు గ్రేటర్ అధికారులు నోటీసులు జారీ చేశారు.అనంతరం శనివారం రోజున హైదరాబాద్‌లోని జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద అనుమతి లేకుండా రోడ్డుపైనే వెలిసిన నిర్మాణాలను కూల్చివేశారు. 

లోటస్ పాండ్ వద్ద సెక్యూరిటీ వారి కోసం వేసిన షెడ్లను అధికారులు తొలగించారు. రోడ్డును ఆక్రమించుకొని వాహనాల రాకపోకలకు అడ్డుగా ఈ షెడ్లు ఉన్నాయనేది ప్రధాన కారణం. ఆ రోడ్డు మార్గంలో వాటి వల్ల రాకపోకలు సాగించడం అసౌకర్యంగా ఉందనీ స్ణానికుల నుంచి ఫిర్యాదు జీహెచ్‌ఎంసీ అధికారులకు అందింది. 

ఆ మూడు షెడ్లు ఏపి మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి భద్రతకు, పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ అయిన ఐపాక్(ఐపిఏసి)కి చెందిన వారు ఉపయోగించుకుంటున్నారు. వీటికి అనుమతి లేదనీ, వాటిని కూల్చేసి రోడ్డలో వాహనా రాకపోకలకు అంతరాయం కలగకుండా చూశారు.