![](https://nijamtoday.com/wp-content/uploads/2024/06/Jagan-Lotus-Pond.jpg)
లోటస్ పాండ్ వద్ద రోడ్డుకు అడ్డుగా నిర్మాణాలు వెలివాయి. ఇవి రోడ్డుపైనే ఉన్నాయన్న ఫిర్యాదు స్థానికుల నుంచి గ్రేటర్ అధికారులకు అందింది. గత శుక్రవారం ఆ నిర్మాణాదారులకు గ్రేటర్ అధికారులు నోటీసులు జారీ చేశారు.అనంతరం శనివారం రోజున హైదరాబాద్లోని జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద అనుమతి లేకుండా రోడ్డుపైనే వెలిసిన నిర్మాణాలను కూల్చివేశారు.
లోటస్ పాండ్ వద్ద సెక్యూరిటీ వారి కోసం వేసిన షెడ్లను అధికారులు తొలగించారు. రోడ్డును ఆక్రమించుకొని వాహనాల రాకపోకలకు అడ్డుగా ఈ షెడ్లు ఉన్నాయనేది ప్రధాన కారణం. ఆ రోడ్డు మార్గంలో వాటి వల్ల రాకపోకలు సాగించడం అసౌకర్యంగా ఉందనీ స్ణానికుల నుంచి ఫిర్యాదు జీహెచ్ఎంసీ అధికారులకు అందింది.
ఆ మూడు షెడ్లు ఏపి మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి భద్రతకు, పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ అయిన ఐపాక్(ఐపిఏసి)కి చెందిన వారు ఉపయోగించుకుంటున్నారు. వీటికి అనుమతి లేదనీ, వాటిని కూల్చేసి రోడ్డలో వాహనా రాకపోకలకు అంతరాయం కలగకుండా చూశారు.
More Stories
పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడించిన యువమోర్చ
తెలంగాణలో హెల్త్ టూరిజం హబ్
బీఆర్ఎస్ ఎమ్యెల్యేపై సోదాల్లో రూ 300 కోట్ల అక్రమాలు గుర్తింపు