
పశ్చిమబెంగాల్లో ఘర్షణలు
పశ్చిమబెంగాల్ సందేశ్ఖాలీలోని బైరామరిలో ఎన్నికల అక్రమాల ఆరోపణలపై బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతోపాటు టియర్గ్యాస్ ప్రయోగించారు. ఘర్షణల్లో ముగ్గురికి గాయాలయ్యాయని బసిర్హత్ ఎస్పీ తెలిపారు.
జాదవ్పూర్, డైమండ్ హార్బర్ నియోజకవర్గాల్లోనూ ఘర్షణలు చోటుచేసుకొన్నాయి. పోలింగ్ కేంద్రాల్లోకి తమ పార్టీ ఏజెంట్లకు రాకుండా అడ్డుకొన్నారని ఆరోపిస్తూ టీఎంసీ, బీజేపీ, ఐఎస్ఎఫ్ మద్దతుదారులు జాదవ్పూర్లో గొడవపడ్డారు. జాదవ్పూర్లోని భాంగర్ ఏరియాలో ఒకరిపై ఒకరు నాటుబాంబులు వేసుకొన్నట్టు సమాచారం.
దక్షిణ 24 పరగణాల జిల్లా కుల్తాలిలో పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడిన కొంత మంది.. ఈవీఎంలను తీసుకెళ్లి చెరువులో పడేశారు. జయనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని బేనిమాధవ్పూర్ ఎఫ్పీ స్కూల్ పోలింగ్ కేంద్రంలోకి ఏజెంట్లను రానివ్వకుండా అడ్డుకొన్న నేపథ్యంలో ఉదయం సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తున్నది. ఆగ్రహించిన స్థానికులు.. వీవీప్యాట్తో సహా ఈవీఎంను, పోలింగ్కు సంబంధించిన పలు పేపర్లను తీసుకెళ్లిపోయారు.
4న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్
లోక్సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఈనెల 4న ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అవుతుందని ఎన్నికల సంఘం శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. కౌంటింగ్ ఏర్పాట్లు, కౌంటింగ్ ప్రక్రియ, ఈవీఎంలు, పేపర్ ట్రయల్ మెషిన్ల స్టోరేజ్కు సంబంధించి కొన్ని తాజా మార్గదర్శకాలను షేర్ చేసింది. రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్పై మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది.
More Stories
30 నాటికి ఎస్ఐఆర్ అమలుకు సిద్ధంగా ఉండండి
జమ్ముకశ్మీర్లో చైనా గ్రెనేడ్లు స్వాధీనం .. ఉగ్ర కుట్ర భగ్నం
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి