![](https://nijamtoday.com/wp-content/uploads/2024/06/Manipur.jpg)
ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్ జిల్లాల్లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో వైమానిక దళం, నౌకాదళం, సైన్యాన్ని మోహరించారు. ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్, జిరిబామ్, నోనీ, కాంగ్పోక్పి, తమెంగ్లాంగ్, చందేల్, చురాచంద్పూర్, సేనాపతి, కక్చింగ్ సహా పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక సామగ్రిని పంపిణీ చేశారు.
ఇప్పటివరకు 969 మంది పురుషులు, 992 మంది మహిళలు, 601 మంది పిల్లలతో సహా మొత్తం 2,561 మందిని రక్షించినట్లు రెస్క్యూ మిషన్లో మోహరించిన అసోం రైఫిల్స్ తెలిపింది. అసోం రైఫిల్స్కు చెందిన పదహారు దళాలు.. మే 30న 2,050 మందికి, మే 31న 3 వేల మందికి ప్యాక్ చేసిన ఆహారాన్ని పంపిణీ చేశాయి. ఇంఫాల్ పట్టణం, చుట్టుపక్కల వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటి మట్టాలు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే ప్రధాన మార్కెట్ ప్రాంతాలు (ఎంజీ అవెన్యూ, తంగల్ బజార్, పానా) ఇంకా నీటిలోనే ఉండగా, బిష్ణుపూర్ జిల్లాలోని నాంబోల్.. వరదలకు ప్రభావితమైన జాబితాలో తాజాగా చేరింది.
శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వినీత్ జోషితో కలిసి ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఇంఫాల్ లోని వరద ప్రభావిత పానా బజార్ ను సందర్శించారు. సిఎం బీరెన్ సింగ్ ట్వీట్ చేస్తూ ” రెమాల్ తుఫాను తరువాత మణిపూర్లో వరద పరిస్థితి గురించి గౌరవనీయ హౌం మంత్రి శ్రీ అమిత్ షా నుంచి నాకు ఫోన్ వచ్చింది. పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సాధ్యమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు” అని చెప్పారు.
More Stories
యువమోర్చ కార్యకర్తలలపై లాఠీఛార్జ్ పట్ల ఆగ్రహం
ఆగస్టు 11న నీట్ -పిజి పరీక్షలు
అస్సాంలో వరద బీభత్సం… 52 మంది మృతి