
తెలంగాణ అధికారిక చిహ్నంలో మార్పులు వివాదాస్పదంగా మారడంతో 10వ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా జూన్ 2వ తేదీన చిహ్నంను ఆవిష్కరించే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరమించుకున్నారు. చిహ్నంలోని కాకతీయ కళాతోరణం, చార్మినార్ ల తొలగింపుపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో వెనుకడుగు వేసిన్నట్లు తెలుస్తున్నది.
ఇందుకోసం కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన పలు నమూనాలను సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. వీటిలో దానిని ఖరారు చేసి ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న విడుదల ఆవిష్కరించాలని భావించారు. నూతన చిహ్నంను ఖరారు చేసేందుకు గురువారం సాయంత్రం మేధావులు, వివిధ పార్టీల నాయకులతో ముఖ్యమంత్రి ఓ సమావేశం కూడా ఏర్పాటు చేశారు.
తెలంగాణ చారిత్రక చిహ్నాలను కాంగ్రెస్ తొలగిస్తోందని, లోగోలో చార్మినార్ను తొలగించడమంటే హైదరాబాద్ను అవమానించడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆ మేరకు ఆయన చార్మినార్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వైభవానికి చిహ్నమైన కాకతీయుల కళా తోరణాన్ని ఎలా తొలగిస్తారని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా లోగో రూపొందించడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి