
డ్రైవింగ్ లైసెన్స్ జారీకి ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువస్తోంది. ఇప్పటి వరకు ఉన్న నింధనలలో కొన్నింటిని సవరించింది. డ్రైవింగ్ లైసెన్స్, ట్రైనింగ్ సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ జూన్ 1, నుంచే అమలులోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నిబంధనల మార్పు అంశంపై ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇక నుంచి ఆర్టీఓ కార్యాలయానికి డ్రైవింగ్ టెస్ట్కు హాజరుకావాల్సిన అవసరం లేదు. ప్రైవేటు సంస్థలు కూడా డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి, సర్టిఫికెట్లను జారీ చేయవచ్చు. నూతన నిబంధనల ప్రకారం ఇకపై వాహనదారులు ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయం(ఆర్టీఓ)లో డ్రైవింగ్ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదు.
ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లడానికి బదులుగా మీరు ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్ల వద్ద డ్రైవింగ్ టెస్టుకు హాజరుకావచ్చు. వారు డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి వాహనదారుడికి ఓ సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ తీసుకుని ఆర్టీఓ ఆఫీసులో ఇవ్వాల్సి ఉంటుంది. దానితో పాటు పలు పత్రాలు సమర్పించాలి. ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం నేరుగా ఆర్టీఓ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించడం. పూర్తిగా ఆన్లైన్ ద్వారా లైసెన్స్ జారీ చేయడం.
దీని ద్వారా సమయం కలిసొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు పలు నిబంధనలు పెట్టింది. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కోసం అయితే ఒక ఎకరం భూమి కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అలాగే ఫోర్ వీలర్ శిక్షణ కోసం అయితే మరో 2 ఎకరాల భూమి అదనంగా ఉండాలని పేర్కొంది. అన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉంటే వారికి ప్రభుత్వం లైసెన్స్ జారీ చేస్తుంది.
అలాగే అందులో ఉండే ట్రైనర్లకు కనీసం హైస్కూల్ డిప్లామా అర్హత తప్పనిసరి చేసింది కేంద్రం. కనీసం 5 ఏళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలని నొక్కి చెప్పింది. బయోమెట్రిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ మౌలిక అంశాలపై అవగాహన ఉండాలని తెలిపింది.
డ్రైవింగ్ నేర్పించేందుకు కాలపరిమితికి సంబంధించి కూడా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. లైట్ వెహికిల్ ట్రైనింగ్ను కచ్చితంగా నాలుగు వారాల పాటు, కనీసం 29 గంటల పాటు శిక్షణ ఇవ్వాలి. ఇందులో ఎనిమిది గంటలు థియరీ, 21 గంటలు ప్రాక్టికల్ ఉంటుంది. హెవీ మోటార్ వాహనాల డ్రైవింగ్కు ఆరు వారాల పాటు కనీసం 39 గంటల ట్రెయినింగ్ ఇవ్వాలి. ఎనిమిది గంటలు థియరీ, 31 గంటలు ప్రాక్టికల్ తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది.
More Stories
ఢిల్లీలో నలుగురు బీహార్ మోస్ట్వాంటెడ్ గ్యాంగ్స్టర్లు హతం
లోక్పాల్ కు ఏడు బిఎండబ్ల్యూ కార్ల కొనుగోలుపై దుమారం
శబరిమల బంగారం కేసులో కుట్ర?.. దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం