
పోలీసులకు తన వాంగ్మూలాన్ని ఇచ్చినట్లు ఎంపీ స్వాతి మాలీవాల్ గురువారం వెల్లడించారు. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని బీజేపీకి విజ్ఞప్తి చేశారు. “నా విషయంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. దీనిపై పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాను. వారు తగిన చర్య తీసుకుంటారని భావిస్తున్నాను. నా కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు. నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నవారు నేను మరో పార్టీ కోసం పనిచేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. వారిని ఆ దేవుడే కాపాడాలి” అని ఎక్స్లో మాలీవాల్ రాసుకొచ్చారు.
మాలీవాల్పై దాడి జరిగిందన్న ఘటనపై డిల్లీ సీఎం కేజ్రీవాల్ తగిన చర్యలు తీసుకుంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక ఆశాభావం వ్యక్తం చేశారు. రాయ్ బరేలీ లోక్సభ నియోజకవర్గ పరిధిలో గురువారం ఆమె ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ “కేజ్రీవాల్కు ఈ విషయం తెలుసు. ఆయన తగిన పరిష్కారం కనుగొంటారు” అని ప్రియాంక చెప్పారు.
కాగా, అరవింద్ కేజ్రీవాల్కు కట్టుబడి ఉండటమే బిభవ్ కుమార్ వృత్తి అని, కేజ్రీవాల్ ఆదేశాల మేరకే ఈ దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడని బీజేపీ నాయకురాలు షాజియా ఇల్మీ ఆరోపించారు. “రాజకీయ లబ్ది కోసం వారు దీనిని సమర్థిస్తున్నారు… ఆమెను (స్వాతి మలివాల్) కొట్టారు… అరవింద్ కేజ్రీవాల్కు కట్టుబడి ఉండటమే బిభవ్ కుమార్ జాబ్ ప్రొఫైల్. ఆ వ్యక్తి దురుసుగా ప్రవర్తిస్తే నేను కూడా సహించాను. కొట్టడం అక్కడ చాలా సాధారణం” అంటూ ఆమె ధ్వజమెత్తారు.
“ప్రశాంత్ కుమార్, యోగేంద్ర యాదవ్లను కూడా బౌన్సర్లు నెట్టివేశారు. అయితే ఈసారి హద్దులు దాటారు… ఓ మహిళను మీ పీఏ కొట్టడం తగునా? పోలీసులు బాగా చేశారు. ఆమె సహాయం కోసం వారు చేరుకున్నారు. కేజ్రీవాల్ వెంటనే రాజీనామా చేయాలి. ఓ మహిళా సహచారిణిని కొట్టిన తర్వాత కేజ్రీవాల్ సీఎంగా ఉండటం సబబు కాదు. ఆయన క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి. వెంటనే ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి” అని ఆమె డిమాండ్ చేశారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం