మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీలో ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ ఓటు వేశారు. ఇందౌర్లో ఓటు వేసేందుకు తెల్లవారుజాము నుంచే భారీ క్యూలు ఉండడం వల్ల ఓటర్లకు ఉచితంగా అల్పాహారం, ఐస్క్రీమ్లు అందించారు. పశ్చిమబెంగాల్లో భారీగా పోలింగ్ నమోదైనప్పటికీ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
బర్దమాన్-దుర్గాపూర్ లోక్సభ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తృణమూల్ కాగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకోగా, కల్నా గేట్లో బీజేపీ అభ్యర్థి దిలీప్ ఘోష్ కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఈవీఎంలు పని చేయకపోవడం, ఏజెంట్ల అడ్డగింత వంటి ఫిర్యాదులు వెయ్యికి పైగా అందినట్లు అధికారులు తెలిపారు.
నాలుగో విడతతో దక్షిణాది రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఉత్తర్ప్రదేశ్లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బంగాల్లో 8 చొప్పున, బిహార్లో 5, ఒడిశా, ఝార్ఖండ్లో 4 చొప్పున, జమ్ముకశ్మీర్లోని ఒక లోక్సభ నియోజకవర్గంలో నాలుగో విడతలో భాగంగా పోలింగ్ జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో చెదురుముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయని, ఎక్కడా కూడా రీ పోలింగ్కు అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా వెల్లడించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుకున్నదానికంటే ఎక్కువ మంది ఓటర్లు పోలింగ్ స్టేషన్కు వచ్చి ఓటును వినియోగించుకోవడం శుభపరిణామని తెలిపారు.
నాలుగో విడత పోలింగ్లో కేంద్రమంత్రులు గిరిరాజ్ సింగ్, అర్జున్ ముండా, లోక్సభలో కాంగ్రెస్ పక్షనేతగా పనిచేసిన అధీర్ రంజన్ చౌధరీ, తృణమూల్ నేత మహువా మొయిత్రా తమ అదృష్టం పరీక్షించుకున్నారు. మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ తృణమూల్ తరపున కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరిపై పోటీ చేశారు. కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా బంగాల్ లోని అసన్సోల్ నుంచి తృణమూల్ తరపున పోటీ చేశారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కన్నౌజ్ నుంచి అదృష్టం పరీక్షించుకున్నారు.

More Stories
సమాజం ఆర్ఎస్ఎస్ ను ఆమోదించింది.. వ్యక్తులు నిషేధింపలేరు
జూబ్లీ హిల్స్ లో బిజెపి ప్రయత్నాలు ముమ్మరం చేయాలి
మతమార్పిడులు, ఫాస్టర్లను అడ్డుకోవడం `రాజ్యాంగ వ్యతిరేకం కాదు’