
9,900 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించామని , శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 12వేలమంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ చేస్తున్నట్లు వివరించారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ పూర్తవుతుందని చెప్పారు.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి రూ.320కోట్ల నగదు, ఉచితాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తనిఖీలకు సంబంధించి 8వేలకుపైగా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సామగ్రి, ఎన్నికల సంబంధించి బల్క్ ఎస్ఎంఎస్లను ప్రదర్శించడం పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.1.90లక్షల మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటారని.. 161 కంపెనీల కేంద్ర సాయుధ దళాలు, పారా మిలిటరీ బలగాలతో మొత్తం 70వేల మంది సిబ్బందిని ఎన్నికల విధులకు కేటాయించినట్లు తెలిపారు.
‘బందోబస్తు కోసం రాష్ట్రానికి 160 కేంద్ర బలగాలు వచ్చాయి. 60 వేల మంది రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉంటారు. పొరుగు రాష్ట్రాల నుంచి కొందరు పోలీసులు వస్తారు. కేంద్ర బలగాలు కాకుండా 72 వేల పోలీసులు బందోబస్తులో ఉంటారు. పోలింగ్ కోసం 87 వేలకు పైగా బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నాం. దాదాపు 20 వేల బ్యాలెట్ యూనిట్లు స్పేర్గా ఉంచుతాం.’ అని వికాస్ రాజ్ తెలిపారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి