బిజాపూర్‌ ఎన్‌కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి

బిజాపూర్‌ ఎన్‌కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి
మావోయిస్ట్‌లకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు నక్సలైట్లు హతమయ్యారు. బుధవారం తెల్లవారుజామున బిజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మహిళా నక్సలైట్ సహా ఆరుగురు హతమైనట్టు పోలీస్ అధికారులు వెల్లడించారు. 
బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చికురుభట్టి, పుసబాక గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి.
బాసగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చీపురుబట్టి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు, మావోయిస్టులు తారసపడ్డారు.  దాంతో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో దళం డిప్యూటీ కమాండర్‌తోపాటు ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఘటన జరిగిన చికుర్భట్టి, పుస్బాకా గ్రామాల చుట్టూ ఉన్న అడవుల్లోని ప్రాంతాన్ని గాలిస్తున్నామని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ సుందర్ రాజ్ తెలిపారు.
బీజాపూర్ జిల్లాలోని చికుర్ బత్తీ-పుస్భాకా అటవీ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళ సహా ఆరు నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చికుర్ బత్తీ ప్రాంతానికి సమీపంలోని తాల్పేరు నది సమీపంలో ఈ ఎన్ కౌంటర్ జరిగిందని చెప్పారు.

తాల్పేరు నది సమీపంలో పీఎల్జీఏ ప్లాటూన్-10 తిరుగుబాటుదారులతో సీఆర్పీఎఫ్‌కు చెందిన కోబ్రా ఎలైట్ యూనిట్, సీఆర్పీఎఫ్ 229వ బెటాలియన్, డీఆర్జీ సంయుక్త బృందం ఎదురుకాల్పుల్లో పాల్గొన్నాయని, గాలింపులో మరణించిన ఆరుగురు నక్సల్స్ మృతదేహాలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారని ఐజీ తెలిపారు.

ఈ తనిఖీల్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు నిత్యావసర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం బసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. బసగూడ జిల్లా రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ 229, కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్ (కోబ్రా) బృందాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి.

మార్చి 23న నక్సల్స్ కంచుకోట దంతెవాడలో జరిగిన ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్) పేలుడులో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. శనివారం నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా కిరండూల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేలుడు సంభవించిందని దంతెవాడ ఎస్పీ తెలిపారు. హోలీ రోజున నక్సలైట్లు ఈ ప్రాంతంలో ముగ్గురు గ్రామస్థులను చంపారు.